Wednesday, April 17, 2024
- Advertisement -

ఫ‌లించిన బొత్స వ్యూహం.. వైసీపీలోకి టీడీపీ కీల‌క నేత‌….

- Advertisement -

ఒక వైపు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌బాబు దూసుకు పోతుంటె…. మ‌రో వైపు ముఖ్య‌నేత‌లు పార్టీని వీడి వెల్తున్నారు. ఇప్ప‌టికే అనేక మంది నేత‌లు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా విజ‌య‌న‌గ‌రంలో జిల్లాలో టీడీపీ పార్టీకి బిగ్ షాక్ త‌గిలింది. పార్టీకి చెందిన కీల‌క నేత వైసీపీలో చేరుతున్నారు.

వైసీపీనేత బొత్స స‌త్య‌నారాయ‌ణ వ్యూహం ఫ‌లించింది. 37 ఏళ్లుగా టీడీపీలో కొనసాగిన విజయనగరం జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కొండపల్లి కొండలరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీలో తనకు అన్యాయం జరిగిందని, రేపు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరుతున్నట్టు ఆయన ప్ర‌క‌ట‌న చేశారు. గజపతినగరం నియోజకవర్గం టికెట్ ఆశించి భంగపడ్డ కొండలరావు మ‌న‌స్థాపంతో వైసీపీలో చేరుతున్నారు.

నియోజకవర్గం నేతలంతా సిట్టింగ్ ఎమ్మెల్యే కేఏ నాయుడికి సీటు ఇవ్వద్దని చెప్పినా టీడీపీ ఆయనకే టికెట్ కేటాయించడంతో అలకబూనిన ఆయన తన అనుచరులతో కలిసి సమావేశమయ్యారు. అనుచ‌రుల అభీష్టం మేర‌కు వైసీపీ కండువా క‌ప్పుకుంటున్నారు. 2014లో తన తమ్ముడిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే తనకు మంచి అవకాశం కల్పిస్తామని మోసం చేశారని కొండపల్లి వాపోయారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -