ఏపీ రాజకీయాలు రోజు రోజుకీ వేడెక్కుతున్నాయి. తెలంగాణా ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ణాతంలోకి వెల్లిన ఆంధ్రా ఆక్టోపస్ మరో సారి తెరపైకి వచ్చారు. ముందస్తుగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో లగడపాటి విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ సర్వే బోల్టాకొట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆయన తీవ్ర విమర్శలకు గురయ్యారు. తాజాగా ఏపీసీఎం చంద్రబాబును కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉండవళ్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి రాజగోపాల్ బాబుతో భేటీ అయ్యారు. చాలా రోజుల తర్వాత కలవడంపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది నెలల్లోనే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… రాష్ట్రంలోని పరిస్థితులు, ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయనే దానిపై లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏదైనా నివేదిక ఇచ్చారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇరువురి భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనే అంశం సస్పెన్స్గానే మిగిలిపోయింది.