Thursday, April 18, 2024
- Advertisement -

లోకేష్ మాటలు మరీ చిత్రంగా ఉన్నాయి.. స్పీడు పెంచుతారట..?

- Advertisement -

తనకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడు మీడియా ముందుకు వచ్చి లోకేష్ బాబు అధికార పార్టీ వైసీపీ పై కొన్ని విమర్శలు చేసి మళ్ళీ నిద్రలోకి జారుకుంటారు.. అయితే నోటికొచ్చింది చెప్పి తాను నవ్వుల పాలు అవడమే కాకుండా పార్టీ పరువును కొంత తీస్తుంటాడు.. అప్పటికి జరుగుతున్న పరిస్థితులు తెలుసుకోకుండా అప్పటికే పరిష్కారం అయిపోయినటువంటి పూర్వకాలం నాటి పరిస్థితులపై మాట్లాడి టీడీపీ నేతలకే నవ్వు తెప్పిస్తుంటాడు.. ఇది ఎప్పుడు వినే రామాయణమే అయినా కరోనా కారణంగా అయన  ఇంట్లోనే ఎక్కువగా ఉంటున్నాడు.. సోషల్ మీడియా వేదికగా అయన చేస్తున్న హాస్య విన్యాసాలు “అదిరింది” షో ని తలపిస్తుండగా ఇటీవలే అవినీతి కేసులో జైలుకెళ్లి వచ్చిన టీడీపీ నేతలను పరామర్శించడానికి ఏపీలో అడుగుపెట్టి వారితో మాట్లాడుతున్నారు..

ఇటీవలే అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి, హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న కొల్లు రవీంద్ర లను తండ్రి కొడుకులు అదేదో స్వాతంత్య్ర ఉద్యమంలో జైలు కి వెళ్లొచ్చిన వారి మాదిరి కలుసుకోవడం ఒకింత హాస్యాస్పదంగా ఉన్నా ఆ సందర్భంగా వాళ్ళు మీడియా ప్రెస్ మీట్ లు పెట్టి అధికార ప్రభుత్వంపై విమర్శలు చేయడం మరింత నవ్వు తెప్పిస్తున్నాయి.. అయితే ఇటీవలే ఎప్పుడు ఏం మాట్లాడాలో తండ్రి శిక్షణ ఇచ్చినట్లు గా ఉండే లోకేష్ మాటలు వింటే మరీ చిత్రంగా ఉన్నాయని అనుకుంటున్నారు ప్రజలు..

హత్య కేసులో నిందితులు గా ఉన్న కొల్లు రవీంద్ర ను లోకేష్ ఇటీవలే కలవగా ప్రభుత్వం కక్ష్యపూరిత చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం కాదు..భవిష్యత్ లో వారు కూడా ఇదే అనుభవిస్తారు.. ప్రస్తుతం కరోనా కారణంగా బయటకి రాలేకపోతున్నాను.. కరోనా పూర్తి గా తగ్గగానే నా విశ్వరూపం చూస్తారు.. ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నట్లు అయన వ్యాఖ్యలు చేయగా  వైసీపీ ప్రభుత్వంపై సమరశంఖం మోగిస్తాడని ఆశిస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలకు  ఇది కొంత ఉత్సాహాన్నిచ్చింది.. మరి అధికారంలో ఉన్నపుడే లోకేష్ బాబు ఓడిపోయినప్పటికీ ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాడో చూడాలి..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -