Saturday, April 20, 2024
- Advertisement -

మహాకూటమి పొత్తు ఖారారు …!

- Advertisement -

తెలంగాణలో మహాకూటమిలో పొత్తు కుదిరిందని స‌మాచారం అందుతుంది. కాంగ్రెస్, టీడీపీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి, నెగ్గాలంటే తగ్గాలన్న సూత్రాన్ని పాటించడంతో సమస్య సద్దుమణిగింది. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలుండగా, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లలో పోటీ చేయనుంది. మిత్రపక్షాల్లో టీడీపీకి 15, టీజేఎస్ కు 10, సీపీఐకి 4 స్థానాలను ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించగా, అందుకు మిగతా పార్టీలు కూడా సమ్మతించినట్టు తెలుస్తోంది.

సీట్ల సంఖ్యపై నేడో, రేపో, అధికారిక ప్రకటనను వెలువరించనున్న మహాకూటమి నేతలు, ఆపై తామంతా ఐకమత్యంగా ఉన్నామన్న సంకేతాలను వెలువరుస్తూ అభ్యర్థుల పేర్లను ఉమ్మడిగా ప్రకటిస్తారని సమాచారం. కాగా, అసెంబ్లీ ఎన్నికలతో పాటు, రానున్న లోక్ సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మహాకూటమి నేతలు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -