Tuesday, April 16, 2024
- Advertisement -

షాకింగ్ః లోకేష్ పరువు తీసేసిన భూమా బంధువు ఎస్వీ మోహన్‌రెడ్డి

- Advertisement -

భూమా ఫ్యామిలీ మొత్తం కూడా టిడిపిలో అసంతృప్తితో ఉన్నారనేది కంటికి కనిపిస్తున్న నిజం. అఖిలప్రియతో పాటు ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా బాబుపై కోపంతో ఉన్నారు. ఇప్పుడు ఆ ఫీలింగ్స్‌తోనే లోకేష్ పరువు పూర్తిగా పోయేలా చేస్తున్నాడు ఎస్వీ మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో ఎస్వీ మోహన్‌రెడ్డికి కర్నూలు అసెంబ్లీకి టిడిపి సీటు దక్కడం కష్టంగానే ఉంది. టీజీ వెంకటేష్‌లాంటి బడా పారిశ్రామికవేత్త, కోట్లు ఖర్చు పెట్టగల టీజీ వెంకటేష్ కొడుకుని కాదని ఎస్వీ మోహన్‌రెడ్డికి చంద్రబాబు టికెట్ ఇచ్చే ఛాన్సే లేదని టిడిపి నేతలే డైరెక్ట్‌గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో తన సీటును ఎలా అయినా కాపాడుకోవాలన్న ప్రయత్నంలో ఏకంగా నారా లోకేష్ పరువు పోయేలా చేస్తున్నాడు ఎస్వీ మోహన్‌రెడ్డి.
చంద్రబాబు భాషలో చెప్పాలంటే డైరెక్ట్ ఎన్నికల్లో గెలవలేక దొడ్డిదారిన మంత్రి అయ్యాడు లోకేష్. తండ్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉండడంతో అలా అడ్డదారిలో గద్దె ఎక్కేశాడు లోకేష్. అయితే టిడిపి భావి ముఖ్యమంత్రిగా పచ్చ బ్యాచ్ మొత్తం భజనలు చే్స్తున్న, కీర్తిస్తున్న నాయకుడు కనీసం ప్రజల చేత ఓట్లేయించుకుని గెలుస్తాను అన్న కాన్ఫిడెన్స్ చూపించకపోతే ఆ పార్టీకి, చంద్రబాబుకు ఎంత పరువు తక్కువ. అందుకే 2019 ఎన్నికల్లో లోకేష్‌ని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని అనుకున్న చంద్రబాబు…………లోకేష్ కచ్చితంగా గెలిచే సీటు కోసం ఎపి అంతా జల్లెడ పడుతున్నాడు. తోక ప్రతిక అధినేత కూడా సర్వేలు చేయిస్తున్నాడు. ఆ విషయం మొత్తం తెలిసిన ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు నుంచి లోకేష్‌ని ఎలాగూ పోటీ చేయించరు, చేయిస్తే లోకేష్ ఓడడం గ్యారెంటీ అన్న నమ్మకం పచ్చ బ్యాచ్‌కి ఉన్న నేపథ్యంలో లోకేష్ కోసం కర్నూలు సీటు త్యాగం చేస్తానని, వేరే ఎవ్వరి కోసం తప్పుకునే ప్రసక్తే లేదని ప్రకటనలు చేస్తున్నాడు. కర్నూలు నుంచి లోకేష్ పోటీ చేసే ఛాన్సే లేదు. పోటీ చేసినా గ్యారెంటీగా ఓడిపోతాడు అన్న విషయం బాబుకు తెలుసు కాబట్టి కచ్చితంగా లోకేష్‌ని పోటీ చేయించడు…………..కర్నూలు సీటు నాదే అన్న నమ్మకంతో ఎస్వీ మోహన్‌రెడ్డి ఆడుతున్న గేం ఆయనకు ఎలా ఉన్నా అనవసరంగా లోకేష్ పరువు తీస్తున్నాడని పచ్చ తమ్ముళ్ళు వాపోతున్నారు. నా తాత సిఎం, మా నాన్న సిఎం అని గొప్పలు పోతున్న లోకేష్ అంటే కనీసం టిడిపి నాయకులకు కూడా గౌరవం లేకపోతోందని, ప్రత్యర్థులు డైరెక్ట్‌గా పంచ్‌లేస్తే టిడిపి నాయకులు ఇలా ఇండైరెక్ట్ సెటైర్స్‌తో లోకేష్ పరువుతీస్తున్నారని ఒక టిడిపి నాయకుడు వాపోయాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -