ప్రభుత్వం అన్నాకా అందరి ఎమ్మెల్యేలను మెప్పించడం చాలా కష్టం.. చాల సమీకరణాల దృష్ట్యా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం, వారికి తగ్గ పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వారిలో కొంతమందికి అనుకున్న పదవులు, ఉన్నత స్థానాన్ని కల్పించడం కుదరకపోవచ్చు.. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన మంత్రి వర్గ విస్తరణం ను రెండు భాగాలుగా చీల్చి రెండున్నరేళ్ళకోసారి మంత్రి వర్గ విస్తరణ చేయాలనీ నిర్ణయించారు.. ఈ నేపథ్యంలో మొదటి మంత్రి వర్గ విస్తరణలో చాలామంది కి మొండి చేయి చూపాల్సి వచ్చింది.. రోజా వంటి కీలక మైన మహిళా నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండానే జగన్ సరిపుచ్చాడు..
ఇక తాజాగా ఓ మహిళా ఎమ్మెల్యే జగన్ పై కొంత అసహనం గా ఉందని తెలుస్తుంది. అందుకు కారణం ఆమెకు పార్టీ లో సరైన సముచిత స్థానం ఇవ్వకపోవడమే కారణం అంటున్నారు.. పార్టీ కోసం మొదట్నుంచి కష్టపడుతూ ఎంతో సన్నిహితంగా జగన్ తో ఉన్నా కూడా తనకు సరైన విలువ ఇవ్వడం లేదని ఆమె వాదన.. పార్టీ కోసం.. పనిచేసి.. ఓటములు ఎదుర్కొని.. ప్రత్యర్థుల నుంచి అనేక విమర్శలు చవిచూసినా ఉన్నత స్థానం కల్పించకపోవడం పార్టీ కోసం కృషి చేసిన వారిలో అంతో ఇంతో బాధ ఉండడం సహజం. జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నవారిలో రాష్ట్రంలో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎంతో మంది ఉన్నారు. ఈ లిస్టులో చాలా మందే ఉన్నారు. వారిలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా రెండు నుంచి ఐదు సార్లు గెలిచిన వారు ఎలాంటి ప్రయార్టీ లేకపోవడంతో వారిలో అసహనం మామూలుగా రగిలిపోవడం లేదు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రస్తుత ఎమ్మెల్యే రెడ్డి శాంతి జగన్ పై అసహనం విషయంలో మొదటివరుసలో ఉన్నారట.. శ్రీకాకుళం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పాలవలస రాజశేఖరం కుమార్తె అయిన రెడ్డి శాంతి పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేశారు. నిన్నగాక మొన్న పార్టీ లోకి వచ్చిన వారికి పెత్తనం ఇవ్వడం ఆమెకు నచ్చడం లేదట.. దాంతో జగన్ పై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారట ఆమె.. మంత్రి పదవి ఆశించిన రెడ్డి శాంతికి కనీసం నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. పార్టీ కోసం ఎంతో ఖర్చు చేసి.. అప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోయినా తాను ఎంతో కష్టపడ్డానని ఆమె వాపోతోన్న పరిస్థితి.