Wednesday, April 24, 2024
- Advertisement -

సున్నావడ్డీ పై ఆర్ కే రోజా కామెంట్స్…!

- Advertisement -

రాష్ట్రాన్ని చంద్రబాబునాయుడు మూడున్నరలక్షలకోట్ల అప్పుల్లో ముంచేసినా కూడా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ఎలా ముందుకు వెళ్తున్నారో మనం కళ్లారా చూస్తున్నాం. ఈరోజు కరోనా మహమ్మారివల్ల రాష్ర్టానికి ఆదాయం లేకపోయినా అక్కచెల్లెళ్లను కాపాడాలి అని ఈ సున్నా వడ్డీ పధకాన్ని మళ్లీ అమలు చేస్తున్నారు.

90 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రాష్ర్టవ్యాప్తంగా వారి అకౌంట్లలోకి 1400 కోట్ల రూపాయలు రావడమనేది చాలా సంతోషించాల్సిన విషయం.ఒక మహిళగా మహిళలందరి తరపున నేను జగన్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కరోనా సమయంలో, ఆదాయం లేని సమయంలో ఏదైనా సాకులు చెప్పి తప్పించుకోవచ్చు. అలా తప్పించుకునే మనస్తత్వం కాకుండా ఎప్పుడూ కూడా ఆడపడుచులకు అన్నా,తమ్ముడిగా ఉండాలన్న జగన్ గారి ఆలోచనను నేను అభినందిస్తున్నాను.

ఈరోజు టిడిపి మహిళానేతలు మాట్లాడుతున్నారు…సున్నావడ్డీ పెద్ద విషయం కాదు. డ్వాక్రా రుణాలు మాఫి చేస్తామన్నారు అది చేయండి అంటున్నారు. అసలు అక్కచెల్లెళ్ల గురించి డ్వాక్రామహిళల గురించి మాట్లాడే అర్హత టిడిపివారికి ఉందా అని ప్రశ్నిస్తున్నాను. గతంలో 2016-2019 వరకు సున్నావడ్డీ ఇవ్వకుండా దాదాపు మూడువేల కోట్ల రూపాయలు చంద్రబాబు ఎగ్గొట్టి మోసం చేసిన విషయాన్ని టిడిపి మహిళానేతలు గుర్తుకుతెచ్చుకుంటే మంచిది.

చంద్రబాబు అసలు వడ్డీతో సహా మాఫి చేస్తామని ఎన్నికలలో హామి ఇచ్చి వారిని అప్పుల్లో ముంచేసి వెళ్లారు. వారికి జగన్ గారి గురించి మాట్లాడేందుకు అర్హత ఉందా అని అడుగుతున్నాను. మా మేనిఫెస్టో వారు చదివారో లేదో తెలియదు గాని ఒకసారి కళ్లు తెరిచి చూడండి. రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలు నాలుగువిడతలుగా డ్వాక్రా లోన్ ఏదైతే ఉందో అది అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి వేస్తామని జగన్ గారు చెప్పారు. దానిప్రకారం గా అది చేస్తారని మీ అందరికి తెలియచేస్తున్నాను.

ఈరోజు అమ్మఒడి పధకం దేశంలో ఎక్కడైనా ఉందా ….గొప్ప ఆలోచనతో ఆడబిడ్డలను కాపాడాలి,వారి బిడ్డలు బాగా చదువుకోవాలి అని చెప్పి 43 లక్షలమంది పిల్లలున్నతల్లులకు 15 వేల రూపాయలు వారి అకౌంట్లలోకి వేసిన అన్న జగన్ గారు. వసతి దీవెన పధకం కింద విద్యార్దులకు 20 వేలు ఇస్తూ వారి తల్లుల అకౌంట్లలోనే జమచేస్తున్నారు.

ఇలా రాష్ర్టం అప్పుల్లో ఉన్నా ఆయన చేస్తున్న కార్యక్రమాలకు అభినందించాల్సింది పోయి బురదచల్లడమే పనిగా పెట్టుకున్నారు. టిడిపి మహిళానేతలు గుర్తుపెట్టుకోవాల్సింది…కాల్ మనీ,సెక్స్ రాకెట్ లలో ఆడవారిని వ్యభిచార కూపంలోకి దించినపుడు మీరు మాట్లాడలేదు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు 14 వేల కోట్ల రుణమాఫి చేయనప్పుడు మీరు మాట్లాడలేదు. వనజాక్షిలాంటి సిన్సియర్ ఎంఆర్ ఓ ఇసుకమాఫియా చేస్తున్న టిడిపి ఎంఎల్ ఏను పట్టుకుంటే ఆమెను తరిమేశారు.

అలాంటి మీరు జగన్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ గారి ప్రభుత్వంలో మహిళలు రక్షణతో,గౌరవంతో ఉన్నారు. ఆర్దికంగా కూడా ఎదుగుతున్నారు. జగన్ గారు వచ్చాక నామినేటెడ్ పోస్టులలో గాని,నామినేటెడ్ వర్క్స్ లో గాని ,వాలంటీర్ వ్యవస్దలోగాని 50 శాతం మనకు ఇచ్చి గౌరవిస్తున్నారు.

ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు కళకళలాడుతుందని ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మేనిఫెస్టోలో మరో వాగ్దానం సున్నావడ్డీ పధకం,కరోనా వ్యాప్తి చెందుతున్న సమయం,ప్రభుత్వం అనేక రకాలుగా ప్రజలకు సహాయాలు అందిస్తున్న సమయంలో మహిళలగురించి ఆలోచించి 1400 కోట్ల రూపాయలు ఇవ్వడం మామూలు విషయం కాదు.

నగరి నియోజకవర్గానికే 11 కోట్ల 26 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇలా ప్రజలందరికి మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ గారికి భగవంతుడు అన్ని రకాలుగా సహాయసహకారాలు అందించాలి. కరోనా వ్యాప్తి చెందకుండా సోషల్ డిస్టెన్స్ పాటించాలి,మాస్కులు ధరించాలి.చేతులు కాళ్ళు శుభ్రం చేసుకుంటూ ఉండాలి.మైనారిటీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు చెబుతున్నాను.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -