టీడీపీ వాళ్లు అడిగే ప్రశ్నలను తన వద్దకు తీసుకుని రావద్దని రోజా అన్నారు. ప్రెస్ అంటే నాకు గౌరవం ఉంది.. కాని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయొద్దు అంటూ సీరియస్ అయింది. మా సీఎం జగన్ గారికి లేని అభ్యంతరం మీకెందుకు ? ఒక వేళ జబర్దస్త్ ? రాజకీయమా అంటే?? నా ప్రయాణం రాజకీయాలవైపే అంటూ వివరణ ఇచ్చారు రోజా. ఆమె మాట్లాడుతూ.. “రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో ఉండక్కర్లేదా ? బాలయ్య సినిమాల్లో చేస్తూ రాజకీయాల్లో లేరా ? డాన్స్లు చేయట్లేదా ? పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి.. సినిమాలు చేస్తున్నారు. చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా పనిచేసి ఆయనా డాన్స్లు చేస్తున్నారు. అంటే మగవాళ్లు చేస్తే తప్పు లేదు. ఆడవాళ్లు చేస్తే తప్పు అని మీరు అనుకుంటున్నారా?? ప్రొఫెషన్ని ప్రొఫెషన్గా చూడండి.
నేను రాజకీయాల్లోకి వచ్చాను అంటే.. నన్ను ఆర్టిస్ట్గా ఆదరించి పేరు, డబ్బు, హోదా ఇచ్చిన ప్రజలకు సర్వీస్ చేయాలని అనుకున్నాను. ఈ విషయంలో నేను ధైర్యంగా ఛాలెంజ్ చేస్తున్నా.. నేను ఏదైతే మోటివేషన్తో ముందుకు వచ్చానో నూటికి నూరు శాతం చేస్తున్నాను. ఇప్పుడు ఆర్టిస్ట్గా నువ్ ఎందుకు డాన్స్ చేశావు.. నువ్ ఎందుకు అందులో యాక్ట్ చేస్తున్నావు అంటే.. నాకూ ఓ ఫ్యామిలీ ఉంటుంది. అవినీతి చేయడం నాకు చేతకాదు. నాకు వేరే బిజినెస్లు లేవు. నాకు తెలిసింది నటన మాత్రమే. అదే చేస్తున్నా.. అయినా మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారికి లేని బాధ వీళ్లకి ఎందుకో నాకు అర్థం కావడం లేదు.
జబర్దస్త్ వల్ల చాలా మంది హ్యాపీగా నవ్వుకుంటారు. సంతోషంగా ఉంటారు. టీడీపీ వాళ్లు ఎన్ని ట్రోల్స్ చేసినా నేను పట్టించుకోను. ఎందుకంటే.. వీళ్లు ఉన్నది 10 శాతం మాత్రమే.. మిగిలిన 90 శాతం మంది నన్ను అభిమానించేవారు ఉన్నారు. రాజకీయంగా నా ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటున్నా. అలానే ఆర్టిస్ట్గా ఆనందాన్ని ఇవ్వగలుగుతున్నా. నన్ను మంచి డాన్సర్ గా అభిమానిస్తున్నారు కాబట్టే డాన్స్ చేస్తా. జబర్దస్త్, రాజకీయం ఈ రెండింటిలో మీరు ఏది కావాలనుకుంటారని అంటుంటే.. నవ్వొస్తుంది. నీకు రెండు కళ్లలో ఏ కన్ను కావాలంటే ఏం చెప్తాం. నేను ఇండస్ట్రీలో ఓ మంచి ఆర్టిస్ట్గా సెటిల్ అయిన తరువాతే పాలిటిక్స్కి వచ్చాను. అటు ఇండస్ట్రీ, పాలిటిక్స్ రెండూ రెండు కళ్లు లాంటివి. నాకు సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ సినిమాల్లో చేసే టైం లేకే జబర్దస్త్ చేస్తున్నా. అయితే భవిష్యత్లో నువ్ ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండాలి అంటే మాత్రం.. నేను చేసేది ఏం లేదు.. ఖచ్చితంగా రాజకీయాలకే ప్రిఫరెన్స్ ఇస్తాను అని రోజా చెప్పుకొచ్చారు.
టీడీపీకి అమరావతి.. వైసీపీకి విశాఖ.. మరి జనసేనకు ?
టీడీపీ వేర్లు కూడా పీకేసిన జగన్.. సరికొత్త చరిత్రను లిఖించాడు..!
మూడు రాజధానులు.. నాలుగు జోన్లు.. 25 జిల్లాలు.. జగన్ పాలన అదరహో..!
గాజువాకలో చిత్తుగా ఓడిపోయాడని.. వైజాగ్ పై పవన్ కి కసి : రోజా