Wednesday, April 24, 2024
- Advertisement -

పోలవరంను ఏటీఎంలా వాడుకున్నట్లు మోడీనే ఆవేదన చెందారు : విజయసాయిరెడ్డి

- Advertisement -

చంద్రబాబుపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు వల్లే నాశనమైందని ఆయన అన్నారు. బాబు అవినీతి, కమీషన్ల కక్కుర్తి ఆంధ్రప్రదేశ్ కి శాపాలుగా మారాయని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పోలవరంలో కమీషన్ల కోసం అప్పట్లో కేంద్రం పెట్టిన షరతులను అంగీకరించారని.. పోలవరంను ఏటీఎంలా వాడుకున్నారని.. ప్రధానీ మోడీనే ఆవేదన వ్యక్తం చేసినట్లు విజయసాయి రెడ్డి అన్నారు. బాబు చేసిన పాపలను సీఎం వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తూ వ్యవస్థను గాడిలో పెడుతున్నారని అన్నారు.

“పేదలు చదువుకునే స్కూళ్ళ నుంచి యూనివర్సిటీల వరకు నిధులివ్వకుండా గాలికొదిలేసి.. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎగదోశాడు. తన బంధువర్గం, పార్టీకి ఫండింగ్ చేసే కార్పొరేట్ మాఫియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు చంద్రబాబు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యతే కాదని సెలవిచ్చిన ‘విజనరీ’ కదా!’ అంటూ” చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

పోలవరంకు రావాల్సిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ కోతను విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం వైసీపీకి చేతకాలేదని.. గతంలో పోలవరంకు వ్యతిరేకంగా వైసీపీ ఫిర్యాదులు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు దీనికంతటికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని వైసీపీ నేతలు అంటున్నారు.

మోడీ సర్కార్ నుండి జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్..!

చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్ట్..!

నమ్మకం కోల్పోయాక కాళ్ళబేరానికి వస్తే ఏం లాభం.?

చంద్రబాబు ఎంత చెప్పిన ఈ ట్రిక్స్ ఆపడా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -