Wednesday, April 24, 2024
- Advertisement -

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి…

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబుపై టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణాలో ఎన్నికల తర్వాత టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. మిగిలి ఉన్న సీనియర్ నాయకులు ఇప్పటికే కారెక్కారు. తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయంపై మాట్లాడిన మాజీ మంత్రి, టీడీపీ మాజీ నేత మోత్కుపల్లి నరసింహులు మండవను కలిసి తెరాసలోకి ఆహ్వానించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు అన్నారు. ఈసందర్భంగా బాబుపై మోత్కుపల్లి విరుచుకుపడ్డారు. టీడీపీలో ఉన్న సీనియర్లు అందరూ తెరాసలో చేరేందుకు రెడీగా ఉన్నారు. చంద్రబాబు అసమర్థుడు. ఆయన వల్ల తెలంగాణ టీడీపీకి ఒరిగేదేమీ లేదు. ఆయనకు ఏపీలోనే దిక్కు లేదు ఇక్కడ ఏం చేస్తాడు. తెలంగాణలో టీడీపీ భూస్థాపితం అయింది’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -