జబర్దస్త్ లో ఎంతమంది కామెడీ చేసిన నాగబాబు, రోజుల నవ్వులు లేకుంటే జబర్దస్త్ చూడలేం. అలాంటి వీరిద్దరి గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఆ విషయంను స్వయంగా నాగబాబు పేర్కొనడం హాట్ టాపిక్ అయింది. విషయంలోకి వెళ్తే.. రాజకీయాల్లో బిజీగా ఉంటునే జబర్దస్త్ షోలో పక్కపక్కనే కూర్చుని.. నవ్వుల్లో మునిగితెలుతారు నాగబాబు, రోజు.
నాగబాబు జనసేనలో ఉండగా.. రోజా వైసీపీలో ఉంది. జనసేన పార్టీ తరుపున నాగబాబు గత ఎన్నికలో పోటీ చేసి ఓటమి చూశారు. జనసేన పార్టీ కూడా పరాజయం పాలైంది. అయినప్పటికి పవన్ కళ్యాణ్ తన పోరాటాని ఆపలేదు. ప్రసుత ప్రభుత్వంపై విమర్శలు చేస్తునే ఉన్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ రోజా, నాగబాబు అంశం చర్చల్లో నిలిచింది. దాంతో ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు వివరణ ఇచ్చారు. ఈమేరకు తనకు రోజాతో ఉన్న రిలేషన్ గురించి చెప్పారు.
రోజా వైసీపీలో ఉంది.. ఆమె అప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడూ మీరు జబర్దస్త్ లో ఆమె పక్కనే కూర్చుని ఎలా నవ్వుతూ జడ్జిమెంట్ ఇస్తున్నారు అన్న ప్రశ్న నాగబాబుకు ఎదురైంది. దీనిపై ఎంతో కూల్గా సమాధానం చెప్పిన నాగబాబు.. జబర్దస్త్ షో లో రోజా, నేను కేవలం ప్రొఫెషనల్గా మాత్రమే ఆలోచిస్తామని, అక్కడ తమని జడ్జిమెంట్ చెప్పమని పిలిచారని.. తమ రిలేషన్ అంత వరకే ఉంటుందని చెప్పారు.
రోజాపై కూడా తనకు ఎలాంటి కంప్లైంట్స్ ఉండవని, ప్రొఫెషనల్గా అసలు రియాక్షన్స్ అనేవే ఉండవని నాగబాబు అన్నారు. జబర్దస్త్ వేరు, రాజకీయాలు వేరు.. కాబట్టి రోజాతో నాకేం సమస్య లేదు అని నాగబబు అన్నారు. ఒకవేళ పర్సనల్ అటాక్ చేస్తే కచ్చితంగా కౌంటర్ ఇస్తానని చెప్పారు. జబర్దస్త్ లో ఉన్నంతసేపు మాత్రం ప్రొఫెషనల్ గానే ఉంటామని నాగబాబు చెప్పుకొచ్చారు.