Wednesday, April 24, 2024
- Advertisement -

చావు తెలివి తేటలతో మరో సారి సోషల్ మీడియాలో బుక్ అయిన లోకేష్ …..

- Advertisement -

నారలోకేస్ తెలివితేటలు తండ్రి బాబు కంటె మించిపోతున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్ లు చేయడం నవ్వుల పాలు కావడం రోటీన్ గా మారింది.నిత్యం ట్విట్టర్ ద్వారా విమర్శలు చేస్తూ అదే రాజకీయం అనుకుంటున్నారేమో అనే విమర్శలు మూటగట్టుకుంటున్నారు. అందులోనూ చేసే విమర్శల్లోనూ అంతగా పస లేక నవ్వులపాలు అవుతున్నారు.

తాజాగా మరో సారి చినబాబు ట్వీట్ చేసి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆటాడేసుకుంటున్నారు. మామ బాలయ్య కంటిచూపుతో ట్రైన్ ఆపినట్లు అల్లుడు నారా లోకేష్ పడవలతో వరద ప్రవాహాన్ని ఆపుతున్నారండూ వ్యవంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

కరకట్టపై ఉన్న చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు తెప్పించడం కోసం.. వైసీపీ నేతలు బ్యారేజీ గేట్లకు అడ్డంగా పడవ పెట్టారట. ఆ పడవ సాయంతో వరదను దారి మళ్లించి చంద్రబాబు నివశిస్తున్న ఇంటివైపు పంపించారట. 3-4 గేట్ల నుంచి వరద ఉధృతికి బయటకి కొట్టుకొని వచ్చిన ఈ పడవే అందుకు సాక్ష్యం. ఈ తెలివితేటలు పాలనలో ఎందుకు చూపించరు వీళ్ళు?’అంటూ ప్రశ్నించారు.

చినబాబు ట్వీట్ ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు. చిన్న పడవతో వరదను ఆపగలమా..? అదే వరదను దారి మళ్లించగలమా? నిజంగా ఇదే సాధ్యమైతే ఇన్ని ఆనకట్టలు ఎందుకు? నదీ పరివాహక ప్రాంతాల్లో ఇన్ని రాతికట్టలు ఎందుకు? ఈ మాత్రం కూడా అవగాహన లేని లోకేష్.. తన చావు తెలివితేటల్ని చూపించారంటూ ఆడుకుంటున్నారు.

వారం, పదిరోజులుగా వరద కొనసాగుతోంది. ఎక్కడో ఒక్కచోట పడవ వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. బ్యారేజ్ గేట్లు ఎత్తిన వెంటనే అది బయలకు కొట్టుకొచ్చింది. ఆ వీడియోను ఎవరో లోకేష్ కు పంపించి ఉంటారు, అతడి ఆస్థానంలో ఉన్న అతితెలివి వ్యక్తులు ఈ కొత్త లాజిక్ చెప్పి ఉంటారు. అంతే, వెంటనే బోట్ కు ఓ సర్కిల్ వేసి మరీ పోస్ట్ పెట్టేశాడు మన మందళ గిరి మాలోకం లోకేష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -