Thursday, April 25, 2024
- Advertisement -

విజయసాయితో ఆనం, ఆదాల మీటింగ్……. జగన్ పిలుపు కోసం వెయిటింగ్

- Advertisement -

నెల్లూరు రాజకీయాలు శరవేగంగా మారుతూ ఉన్నాయి. తన సోదరుడి మరుణానికి కారణమయ్యాడు అనే రేంజ్‌లో బాబుపై ఆగ్రహంతో ఉన్న ఆనం రామనారాయణరెడ్డి టిడిపికి, చంద్రబాబుకు వీలైనంత ఎక్కువ నష్టం చేయాలన్న కసితో ఉన్నాడు. తాను ఒక్కడే పార్టీ మారడం కాకుండా రాజకీయంగా ఓ స్థాయిలో ఉన్న ఆనంల కుటుంబాన్ని తీవ్రంగా అవమానించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పే స్థాయిలో తన ప్రతీకార చర్యలు ఉండాలని ఆనం భావిస్తున్నాడు.

అందులో భాగంగానే తనకు సన్నిహితుడైన టిడిపి పార్లమెంట్ ఇంఛార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డితో కలిసి ఆనం రామనారాయణరెడ్డి వైకాపా నేత విజయసాయిరెడ్డిని కలిశారని తెలుస్తోంది. జగన్ విషయంలో నోరు జారామని, అయితే అప్పట్లో బాబు ప్రలోభాలకు, మోసపు మాటలకు మోసపోయామన్న బాధ ఇప్పుడు వేధిస్తోందని……. వైఎస్‌లు అంటే మొదటి నుంచీ అభిమానం ఉందని మొరపెట్టుకున్నారు. సీటు ఇచ్చే విషయంలో కూడా పట్టింపులేదని …..నెల్లూరు జిల్లాలో మళ్ళీ రాజకీయ ప్రాధాన్యం కావాలని విజయసాయితో ఆనం చెప్పుకొచ్చాడట. మరోవైపు రాజకీయంగా మేం బలహీనమయ్యాం అని తనకు కూడా తెలుసునని ఒప్పుకున్న ఆనం రామాయణరెడ్డి తనను కనుక పార్టీలో చేర్చుకునేటట్టయితే మరికొంత మంది నాయకులు, అనుచరులు అందరినీ తీసుకొస్తానని మాటిచ్చాడట. ఆదాల ప్రభాకరరెడ్డికి ఎమ్మెల్యే సీటు ఇచ్చే పనయితే ఆయన కూడా వైకాపాలో చేరతాడు అని ఆనం చెప్పాడట. ఆనం, ఆదాల ప్రభాకరరెడ్డిలిద్దరూ కూడా నెల్లూరు జిల్లా టిడిపి నేత సోమిరెడ్డికి శతృవులు. అందుకే ఇఫ్పుడు వీళ్ళిద్దరూ కలిసి సోమిరెడ్డి, చంద్రబాబు రాజకీయ వ్యూహాలకు వ్యతిరేకంగా టిడిపిని దెబ్బకొట్టాలన్న కసితో వర్క్ చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నాయకుల చేరికల విషయంలో జగన్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -