Tuesday, April 23, 2024
- Advertisement -

మళ్ళీ నోరు జారిన లోకేష్ బాబు.. వైరల్ అవుతున్న పోస్ట్..!

- Advertisement -

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయన జయంతి ని వర్ధంతి గా, మంగళగిరి ని మందళగిరి గా అన్నారంటూ విమర్శలు చేస్తునే ఉంటారు. అయితే లోకేష్ బాబు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ఉంటారు.

తాజాగా సీఎం వైఎస్ జగన్ పై లోకేష్ చేసిన ఓ ట్విట్ తో లొకేష్ మళ్లీ పప్పులో కాలువేశాడు. లోకేష్ తాజాగా తన ట్విటర్ లో “వైకాపా నాయకులు వారి అధ్యక్షుడు వైఎస్ జగన్ గారే పెయిడ్ ఆర్టిస్ట్ అని గుర్తించడం మంచిది. పార్లమెంట్లో మద్దతు ఇస్తారు. అసెంబ్లీలో నోటిఫికేషన్లు ఇస్తారు. బయటమాత్రం మేము వ్యతిరేకం అని ప్రచారంచేస్తారు. 16 ఆగష్టు 2019న NRC పై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.ఇప్పుడు కడప సభలో NRC అమలు చెయ్యమని ముఖ్యమంత్రిగారు చెప్తున్నారు. ఓట్ల కోసం మడమ తిప్పే నాయకుడు కదా, ఎంతకైనా దిగజారుతారు.” అని సీఎం వైఎస్ జగన్ పై ట్వీట్ చేశారు.

అయితే నారా లోకేష్ ఎన్ఆర్పి, ఎన్ఆర్సి ఒక్కటే అనుకుని ట్వీట్ చేశారనుకుంటా.. దాంతో లోకేష్ పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎన్ఆర్పి, ఎన్ఆర్సి రెండిటికి తేడా ఉందని లోకేష్ ని నేటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గతంలోనూ లోకేష్ ఇలాంటి కామెంట్లు చేసి నవ్వులపాలు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు జనాభా లెక్కలకు, ఎన్ ఆర్ సి కీ తేడా తెలియకుండా ట్వీట్ చేయడంపై లోకేష్ పై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -