Thursday, April 25, 2024
- Advertisement -

రెండు కోట్లు విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్

- Advertisement -

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా పక్రటించారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో తనవంతు భాగస్వామ్యం కోసం ఈ నిధులు అందజేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

‘ఈ కష్టకాంలో ప్రధాని మోదీకి బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆయన నాయకత్వం, స్ఫూర్తిదాయక చర్యలు ఈ కష్టం నుంచి దేశాన్ని గట్టెక్కించగలవని నమ్ముతున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. అలానే కరోనా వైరస్ వ్యాపించకుండా, కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని, నిత్యమూ పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు పవన్ తెలిపారు.

ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఈ డబ్బులను డొనేట్ చేస్తున్నానని, కరోనా మహమ్మారి వ్యాపించకుండా ఈ డబ్బులను వెచ్చించాలని పవన్ కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -