ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు కొన్ని హింసాత్మక సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. అంధ్రప్రదేశ్ భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితాలకోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎదురు చూస్తున్నారు. గెలపుపై జగన్ చిరునవ్వులు చిందిస్తుంటె…బాబు ఓటమి దుఖంలో ఉన్నారు. ఇక ప్రశ్నించడానికే వచ్చానన్న పవన్ పోలింగ్ తర్వాత సైలెంట్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో గొంతు చించుకొని మాట్లాడిన పవన్ గొంతు ఇప్పుడు మూగబోయింది. మా పవనాలు సారు ఎక్కడా అని జనసేన పిల్లలు ఎదురు చూస్తున్నారు.
2014 ఎన్నికల్లో టీడీపీ, భాజాపాకు మద్దతిచ్చిన ఆతర్వాత సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తున్నపవన్ ….పార్టటైం రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ పై విమర్శలు పెరగడంతో డ్యామేజ్ ని తగ్గించుకోవడానికి అజ్ణాత వాసిన సినిమా తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన పవన్ ఇక సమయం అంతా రాజకీయాలకే అంకితమని గొప్పగా సెలవిచ్చిన సంగతి తెలిసిందే.
వామపక్షాలతో కలసి పోటీ చేసిన జనసేన అధికారంలోకి వస్తుందని పవన్, ఆయన అభిమానులు డంఖా బజాయించి చెప్పుకొచ్చారు. పవన్ కూడా అన్ని బహిరంగ సభల్లోను జనసేన అధికారంలోకి వస్తుందని..నేను సీఎం అవుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీన్ కట్ చేస్తె పోలింగ్ ముగిసింది. కాని పవన్ జాడ ఎక్కడా కనిపించడంలేదు. ఎన్నికల ముందు రెచ్చిపోయి విమర్శలు చేసిన పవన్ నోరు ఇప్పుడు మూగబోయింది.
జగన్, బాబు ఇద్దరు ప్రెస్ మీట్లు పెట్టారు. కాని పవన్ మాత్రం అస్సలు ఓ ప్రకటన లేదు., మీడియా మీట్ లేదు. ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు ఇప్పటికే తేల్చేశాయి. జగన్ సీఎం అయితే ఐదు సంవత్సరాలు ఏంచేయాలని పవన్ ఆలోచిస్తున్నారంట.
అసలు విషయానికి వస్తే… పవన్ మళ్లీ సినిమాల వైపు చూపు చూస్తున్నట్లు సమాచారం. ఐదు సంత్సరాలు ఖాలీగా ఉండకుండా కనీసం సినిమాలైన చేయాలని పనవ్ భావిస్తున్నారంట. ఫలితాలు వచ్చాక అప్పటి పరిస్థితులు, రాజకీయ పరిణామాలు అన్నీ చూసిన తరువాత ఎప్పుడు సినిమా చేసేదీ నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే పవన్ కొన్ని చిత్ర నిర్మాణ సంస్థల దగ్గర ఆడ్వాన్స్ లు తీసుకున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే ప్రియనేస్తం త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లోనే ఈ సినిమా వుండబోతోందని తెలుస్తోంది. అయితే అది ఇప్పుడేకాదు, డిసెంబర్ టైమ్ లో అని తెలుస్తోంది.