Thursday, March 28, 2024
- Advertisement -

జెండా పీకేసిన పవన్……… పార్టీ ఆఫీస్‌కి టులెట్ బోర్డ్

- Advertisement -

ప్యాకేజ్ పొలిటీషియన్……….ఎన్నికల వరకే రాజకీయం………. ఆ తర్వాత కనపడడు అన్న ఊహాగానాలకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ వ్యవహారం నడుస్తోంది. పాతికేళ్ళు ప్రజల కోసం పోరాటం చేస్తా……..రాజకీయం చేస్తా అన్న పవన్ ఇప్పుడు మరోసారి తన నైజం బయటపెట్టుకున్నాడు. కేవలం ఎన్నికల వరకే రాజకీయం చేస్తూ…….ఎన్నికలయ్యాక సినిమాలు చేసుకునే తన అలవాటులో భాగంగా ఇప్పుడు మరోసారి ప్రజలను మోసం చేయడానికి రెడీ అయ్యాడు పవన్.

2014 ఎన్నికల సమయంలో మోడీ, బాబులకు ఓటెయ్యండి………..వాళ్ళు మంచిగా పాలించేలా, ఇచ్చిన హామీలు నెరవేర్చేలా తాను చూసుకుంటా అన్న పవన్ ఎన్నికలయిన వెంటనే మాయమయిపోయాడు. తన కెరీర్‌లోనే ఎప్పుడూ లేనంత ఫాస్ట్‌గా నాలుగేళ్ళ కాలంలో మంచిగా సినిమాలు చేసుకున్నాడు. మధ్య మధ్యలో షూటింగ్ గ్యాప్‌లో ఏదో ఒక ప్రజల సమస్యపైన హంగామా చేసేవాడు. చంద్రబాబుకు అవసరమైనప్పుడల్లా కూడా ఇరకాటం నుంచి బాబును బయటపడేయడానికి రాజకీయం చేశాడు. 2019ఎన్నికల ఏడాదిలో మాత్రం సినిమాలు మానేస్తున్నా…….పూర్తిగా ప్రజల కోసమే అని 2014 ఎన్నికల్లో చెప్పినట్టుగానే మళ్ళీ చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలవగానే జనసేన పార్టీ ఆఫీసులు ఒక్కొక్కటీ క్లోజ్ చేసేస్తున్నాడు. ఆల్రెడీ రెండు బేనర్స్‌లో పవన్ కోసం రెండు సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ ఇయర్ ఎండ్‌కి ఆ సినిమాల షూటింగ్‌లు జరుగుతూ ఉంటాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే 2024 ఎన్నికల వరకూ పార్టీ ఆఫీసులు మూసేస్తారని…………ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల ఏడాదిలో అప్పుడు కొత్తగా రెంట్‌కి తీసుకుని కొత్తగా నడిపిస్తారన్న విషయాలను జనసేన నాయకులే చెప్తున్నారు. అయితే ఈ మొత్తం ఎన్నికల హంగామా, ప్యాకేజ్ పాలిటిక్స్ గురించి మాత్రం ప్రజలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో నిజాయితీపరుడిని అని చెప్పుకునే పవన్ మాటలపై వ్యంగ్యాస్త్రాలు ఓ స్థాయిలో కనిపిస్తున్నాయి. అలాగే నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే జెడీ లక్ష్మీనారాయణ కూడా ఈ విషయంపై స్పందించాలని నెటిజనులు కోరుతున్నారు. కేవలం ఎన్నికల సమయంలో ప్రజల ముందుకు రావడం……….ఎన్నికలవగానే ప్యాకప్ అని పార్టీ ఆఫీసులు మూసేసి మేకప్‌కి రెడీ అవ్వడం ఏం రాజకీయం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -