Friday, March 29, 2024
- Advertisement -

జగన్ కోరిక మేరకు దిగివచ్చిన మోడీ.. ఫ్యాన్స్ కు పండగే..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదటి నుంచి చెబుతూ ఉన్నట్టుగానే మూడు రాజధానులు వ్యవహారం గురించి చాలా దూకుడుగా ముందుకు వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి ఒకే ఒక మాట చెబుతోంది. మూడు రాజధానులకు సంబంధించిన ఓపెనింగ్.. అంటే శంకుస్థాపన కార్యక్రమానికి నరేంద్ర మోడీ తీసుకొస్తామని ఆయన ద్వారానే ఇదంతా ఓపెన్ చేస్తామని. అయితే శంకుస్థాపనకు చెప్పినట్టుగానే ప్రధానమంత్రి మోడీ ఆహ్వానించారు. ప్రభుత్వం తరఫున రాజధాని తరలింపు వ్యవహారాన్ని పరివేక్షిస్తున్నటువంటి సీఎంయ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు.

రాజధానుల శంకుస్థాపనకు ప్రధానిని ఆహ్వానించేందుకు జగన్మోహన్రెడ్డికి అపాయింట్మెంట్ కావాలని లేఖలో కోరారు. ప్రత్యక్షంగా అయినా ఆన్లైన్ పద్ధతిలో అయినా ప్రధాని పాల్గొనడం చాలని తన లేఖలో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శాసన పరమైనటువంటి ప్రక్రియ మొత్తాని పూర్తి చేశాయమని ప్రభుత్వం ఆయొక్క లేఖలో రాసుకొచ్చింది. గవర్నర్ బిల్లు పై సంతకాలు పెట్టడంతో గెజేట్ ని కూడా విడుదల చేసింది.

ఇప్పుడు మోడీ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వచ్చి శంకుస్థాపన చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ బిల్లుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు అయితే స్టేటస్ కో విదించింది. అయితే 14 తారీఖు దీనికి సంబంధించి తీర్పు రావాల్సింది.. దాన్ని తొలగించేందుకు ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా వేసింది. అంటే ఈ స్టేటస్ కో ని పక్కన పెట్టాలని కోరుతూ సుప్రీం కోర్టుకు వెళ్లింది ఏపీ ప్రభుత్వం. 14వ తేదీన హైకోర్టులో విచారణ కూడా జరుగుతుంది. అప్పటివరకు ఆగకుండా సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్ వెళ్లడం గురించి డిస్కషన్ నడుస్తున్నాయి.

16న డేట్ ఫిక్స్ చేసినట్లుగా దానికి ప్రధానిని ఆహ్వానించినందుకు అపార్ట్మెంట్ కోరుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే మూడు రాజధానుల అంశం కోర్టులో ఉంది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా శంకుస్థాపన చేయడం సాధ్యం అవుతుందా లేదా అనేది డిస్కషన్ గా మారింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తోంది.

సాధారణంగా ప్రధాన స్థాయి వ్యక్తులు ఎవరైనా ఈవెంట్ కు ఆహ్వానించాలంటే ముందుగా ఆయన కలిసి.. ఫలన కార్యక్రమానికి మీరు రావాలని అడిగి.. ఆయనకు అనుకూలమైన సమయం తీసుకుని ఇప్పుడే డేట్ ఫిక్స్ చేద్దామని ఫిక్స్ అవుతారు. కానీ ఏపీ సర్కార్ ముందుగానే ముహుర్తం పెట్టుకుని ఆ తర్వాత ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించడం ఏమిటనేది ప్రశ్న. అయితే దీనికి సంబంధించినటువంటి సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది.

ఇప్పటికే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డీకి సంబంధించి లాబియింగ్ పూర్తయిందని మోడీ శంకుస్థాపన కు సంభందించిన ప్రోగ్రాం కి రావడానికి ముందుగా ఒప్పుకున్న తర్వాతనే ఈ ముహుర్తంను ఫిక్స్ చేశారని అయితే అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని లేటుగా బయటపెట్టిన తెలుస్తోంది. ఏదేమైనా అమరావతి కి న్యాయం చేస్తూ కర్నూల్ న్యాయం చేస్తూ వైజాగ్ కి న్యాయం చేస్తూ జగన్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మోడీ జై కొట్టాడం.. ఆయన నేరుగా వైజాగ్ రావడానికి ఒప్పుకోవడం అనేది ఇన్‍ట్రెస్టింగ్ పాయింటే.

చంద్రబాబుకు జలక్ ఇస్తున్న తెలుగు తమ్ముళ్లు..!

చంద్రబాబు ప్రెస్ మీట్ అంటే భయపడుతున్న టీడీపీ నేతలు..?

జగన్ సర్కార్ కొత్త నిర్ణయం.. కరోనా రోగి వద్ద కాలింగ్‌ బెల్‌.. !

వైసీపీలో చేరుతా.. కానీ ఆ పని చేయాలి : జేసీ సంచలన వ్యాఖ్యలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -