Saturday, April 20, 2024
- Advertisement -

బాబు ఓట‌మిని ఖారారు చేసిన ప్ర‌శాంత్ కిషోర్‌

- Advertisement -

ఎన్నిక‌ల వ్యూహక‌ర్త‌గా మంచి పేరు తెచ్చుకున్నారు ప్ర‌శాంత్ కిషోర్‌. 2014లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో న‌రేంద్ర మోదీ పీఎం కావ‌డంలో ప్ర‌శాంత్ కిషోర్‌ది కీల‌క పాత్ర అని అంద‌రికి తెలిసిన విష‌య‌మే. 2019లో జ‌రిగే ఎన్నిక‌లకు త‌న పార్టీకి ఎన్నిక‌ల వ్యూహక‌ర్తగా ప్ర‌శాంత్ కిషోర్‌ను నియ‌మించుకున్నారు ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్. ప‌లు ద‌ఫాలుగా ఏపీలో స‌ర్వేలు చేయించింది పీకే టీం. ఏ అభ్య‌ర్థికి నియోజిక వ‌ర్గంలో మంచి పేరుతోపాటు ప‌ట్టు ఉందో స‌ర్వేలు చేయించి మ‌రి పార్టీ అధినేత‌కు త‌మ ఫలితాల‌ను స‌మ‌ర్పించారు. పీకే నిర్ణ‌యంతోనే జ‌గ‌న్ చాలామంది అభ్య‌ర్థుల‌ను మార్చేశారు.

అయితే పీకే పై రెచ్చిపోయారు. ఏపీలో బీహార్ నుంచి రౌడీల‌ను జ‌గ‌న్ తెప్పించి విధ్వంసం సృష్టిస్తున్నార‌ని పీకే పై మాట‌ల దాడి చేశారు చంద్ర‌బాబు. మ‌న డేటాను పీకే దొంగ‌లించి జ‌గ‌న్‌కు అందించార‌ని విమ‌ర్శించారు చంద్ర‌బాబు. దీనిపై ప్ర‌శాంత్ కిషోర్ కూడా అదే రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఏపీ ప్ర‌జ‌లకు మీరు ఏం చేశార‌ని మీకు ఓటు వేయ్యాలో చెప్పాలి కాని, ఇలా మాపైదాడికి దిగ‌డం ఏంట‌ని పీకే చంద్ర‌బాబును ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌శ్నించారు. క‌ళ్ల ఎదుట మీకు ఓట‌మి క‌నిపిస్తుంది అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని ఆయ‌న ఫైర్ అయ్యారు. బీహార్ కు వ్యతిరేకంగా మీ దురభిమానం మరియు దురభిమానాన్ని చూపించే అవమానకరమైన భాషని ఉపయోగించకుండా, మీకు మళ్లీ ఏపీ ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్న విషయంపై దృష్టిని సారించాలని కోరుతున్నాన‌ని త‌న ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చారు.

దీంతో బాబు ఓటమిని ప్ర‌శాంత్ కిషోర్ క‌న్ఫ‌ర్మ్ చేశార‌ని వైసీపీ శ్రేణులు సంబంరాలు చేసుకుంటున్నారు. త‌న ట్విట్‌లో బాబుకు ఓటమి క‌ళ్ల ఎదురుగా క‌నిపిస్తుందని ప్ర‌శాంత్ కిషోర్ రాసుకొచ్చిన దానిని సాక్ష్యంగా చూపిస్తున్నారు. త‌న స‌ర్వేలో కూడా వైసీపీ అదికారంలో రాబోతుంద‌ని తెల‌డంతోనే ప్ర‌శాంత్ కిషోర్ ఇలా నేరుగా చంద్ర‌బాబుని విమ‌ర్శించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -