Thursday, April 25, 2024
- Advertisement -

కేసీఆర్‌ను వాటేసుకుని గొప్ప సీఎం అన్నావుగా…ప‌వ‌న్‌కు పోసాని కౌంట‌ర్‌

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ తెలంగాణా సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తూ సంచ‌ల‌న రేపుతున్నారు. జ‌గ‌న్‌కు ఓటు వేస్తే అది కేసీఆర్ కి వేసిన‌ట్టేన‌ని త‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో విమ‌ర్శ‌లు చేశారు. టీఆర్ఎస్ నేతలు చంద్రబాబుపై కోపంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారని, ఇవ్వాలనుకుంటే వారు ఇక్కడకు వచ్చి పోటీచేయాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు పౌరుషం లేదా? తెలంగాణ నేతలకు బానిసలమా అంటూ మండిపడ్డారు. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు సినీ న‌టుడు పోషాని కౌంట‌ర్ ఇచ్చారు.

తెలంగాణలో ఆంధ్రా ప్రజలను కొడుతున్నారని.. జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. ప‌వ‌న్ అన‌వ‌స‌రంగా రెండు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నార‌ని మండిప‌డ్డారు. సెటిలర్లను తరిమి కొడితే మీరు వస్తారా?.. రారు. తెలంగాణ ప్రజల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పింది ఎవరు? కేసీఆర్ ప్రశంసించింది ఎవరు?. కేసీఆర్ ఆంధ్రుల భూముల్ని లాక్కుంటున్నారా? అని పోసాని ప్రశ్నించారు.కొద్దిరోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ పొగిడి.. ఇప్పుడు జగన్ తిడుతున్నారు. పవన్ మాటల వల్ల వైషమ్యాలు పెరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్ర‌శ్నించారు.కేసీఆర్ వాటేసుకుని గొప్ప ముఖ్యమంత్రి అన్నావు కదా అని పోసాని పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -