పోసాని కృష్ణ మురళి.. సినీ ఇండస్ట్రీలో రచయితగా రాణించి.. ప్రస్తుతమ్ నటుడిగా కొనసాగుతున్నాడు. అయితే ఆయన మనసులో ఏం పెట్టుకోకుండా ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి. సినిమాలైనా – రాజకీయాలపై తప్పును తప్పు అని చెప్పడానికి భయపడని వ్యక్తత్వం పోసాని సొంతం. తాజాగా పోసాని ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేయడంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆయన కామెంట్స్ చేసింది ఎవరిమీద అంటే.. సీఎం జగన్ పై ఒంటికాలి మీదే లేచే హీరో – జనసేనాని మన పవన్ కళ్యాణ్ పై. ఇంతకీ పవన్ పై పోసాని ఏమన్నాడంటే.. “ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ అంటూ పాట అందుకున్నారు. పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పడు ఏం మాట్లాడకుండా ఇలా సెటైరికల్ గా పోసాని పాడిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
మరోసారి పవన్ గురించి అభిప్రాయం చెప్పమని యాంకర్ ప్రశ్నించినా కూడా పవన్ పై కామెంట్ చేయడానికి ఏముంది అంటూ లైట్ గా తీసేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పార్టీని ఏం చేశాడో అందరికీ తెలిసిన విషయమే అని.. ఇంకా నాకేం తెలియదు అంటూ పవన్ పై కామెంట్స్ చేయడానికి పోసాని వెనుకంజ వేశారు. ఏది ఏమైన పోసాని అన్నది కూడా నిజమే అని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.