Thursday, April 25, 2024
- Advertisement -

జంపింగ్ జపాంగ్‌లను పక్కన పెట్టిన బాబు..!

- Advertisement -

ఎంతో కష్ట్రపడి జగన్ నియోజకవర్గాల్లో అభ్యర్థి ని తయారు చేసి ఎంపిక చేసి గెలుపొందేలా చేయడం తీరా గెలిచాక జగన్ నుంచి ఆ అభ్యర్థులను మాయమాటలు చెప్పి చంద్రబాబు బుట్టలో వేసుకుని తన పార్టీ లో చేర్చుకోవడం.. ఇది గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన నిర్వాకం.. ఒకరా, ఇద్దరా.. 23 మంది వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే లు టీడీపీ కి వెళ్లి జగన్ కు నమ్మక ద్రోహం చేశారు.. ఇప్పటికీ జగన్ వారిని క్షమించట్లేదంటే వారిపై జగన్ కు ఎంత కోపం ఉందొ అర్థం చేసుకోవచ్చు.. ఆ పాపమే చంద్రబాబు ను ఈ సారి ఓడించేలా చేసిందని చెప్పొచ్చు..

అయితే వీళ్లలో కొంద‌రు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న జ‌గ‌న్ వీరిని ద‌గ్గ‌ర‌కు రానిచ్చే ప‌రిస్థితి లేదు. దీంతో ఇప్పుడు కాక‌పోతే.. కొన్నాళ్లకైనా చంద్రబాబు ద‌గ్గర‌ త‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంద‌న్న ఆశ‌ల‌తో చాలా మంది నేత‌లు ఉన్నారు. ఇప్పట్లో ఎమ్మెల్సీయో, లేదా మ‌రో ప‌ద‌వో వ‌చ్చే ప‌రిస్థితి లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు వీళ్లకు పార్టీ ప‌ద‌వులే దిక్కు. చంద్రబాబు తాజాగా ప్రక‌టించిన పార్లమెంట‌రీ జిల్లాల క‌మిటీల్లో ఈ జంపింగ్ జపాంగ్‌లు ఎవ్వరికి అవ‌కాశం ఇవ్వలేదు. పోనీ.. రెండేసి పార్లమెంట‌రీ జిల్లాల‌కు ఒక ఇంచార్జ్‌ను నియ‌మించినా ఆ ప‌ద‌వుల్లోనూ ప్రయార్టీ లేదు.

దాంతో జంప్ జిలాని క్యాండెట్ లను చంద్రబాబు పూర్తి గా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. అంతేకాదు లేడీ నేతలను కూడా చంద్రబాబు తనదైన స్టైల్ లో దూరం పెడుతున్నారు.. తెలుగు మ‌హిళా విభాగంలో పార్లమెంటు వారీగా మ‌హిళ‌ల‌కు ప‌ద‌వులు చంద్రబాబు క‌ట్టబెట్టారు. వారిలోనూ వైసీపీ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌ల‌కు కూడా ప్రాధాన్యత లేదు. రంప‌చోడ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే వంత‌ల రాజేశ్వరికి అర‌కు పార్ల‌మెంట‌రీ జిల్లా మ‌హిళా అధ్యక్షురాలు ప‌ద‌వి ఇచ్చినా అక్కడ ఆమె ఎంత డ‌మ్మీ నేతో అంద‌రికి తెలిసిందే. మ‌హిళా నేత‌ల‌కు ప‌ద‌వులు ఇవ్వాలంటే చాలా మంది ఫైర్‌బ్రాండ్లే ఉన్నారు.

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

టీడీపీ నాశనానికి బీజేపీ కి కూడా ఓ కట్టే వేస్తుందా..?

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

వారిని రమ్మని జగన్ ఇన్ డైరెక్ట్ గా చెప్తున్నాడా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -