Friday, March 29, 2024
- Advertisement -

పృథ్వీ రాజ్ డైలాగ్ ట్రెండింగ్.. సోషల్ మీడియాలో వైరల్..!

- Advertisement -

సోషల్ మీడియా మంచికి ఉపయోగపడుతుంది. చేడుకు కుడా అంతే. ఎంత ఫేమస్ చేస్తుందో.. అంతే దిగజారుస్తోంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే నటుడు పృథ్వీ రాజ్ గురించి. నటుడిగా పృథ్వీ రాజ్ బాగా ఫేమస్. అతని కామెడీకి నవ్వాని వారుండరు. అంతబాగా కామెడీ చేయగలడు. అందుకే అతనికి మంచి క్రేజ్ ఉంది.

అయితే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత అతనికి అసలు కలిసి రావడం లేదు. రాజధాని రైతుల విషయంలో నోరు జారి చుక్కుల్లో పడ్డాడు. అది అయిపోయింది అనుకుంటే తాజాగా ఓ మహిళా ఉద్యోగితో రాసలీలల వ్యవహారం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సదరు మహిళా ఉద్యోగిని, పృథ్వీ రాజ్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధిచిన ఆడియో సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయిందో అందరికి తెలిసిందే. రైతుల వ్యవహారంలో పృథ్వీని పోసాని బండా బూతులు తిట్టాడు. అయిన సరే పృథ్వీ తన పద్దతి మార్చుకోకుండా ఈ సారి మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడి దొరికిపోయి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు.

మహిళా ఉద్యోగినితో తన స్థాయిని మరిచి అసహ్యంగా మాట్లాడిన పృథ్వీ..”నేను గుర్తుకు వస్తున్నానా? నువ్వంటే ఇష్టం.. నా గుండెల్లో ఉన్నావ్.. నిన్ను వెనక్కి నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుందాం అనుకున్నా.. లవ్యూ..” అంటూ మాట్లాడాడు. అంతేకాకుండా మీరు తాగి మాట్లాడుతున్నారని సదరు మహిళ అనగా.. తాను ప్రస్తుతం మద్యం సేవించడం లేదు.. మళ్లీ తాగడమంటూ జరిగితే నీవద్దే కూర్చొని తాగుతానంటూ చెప్పాడు. ఈ ఆడియో టేపు బయటకు రావడంతో పృథ్వీ ని వైసీపీకి దూరం పెట్టారు. దాంతో పృథ్వీ కథ అడ్డం తిరిగింది. ఇటు సినిమాలు లేవు.. అటు రాజకీయం లేకుండా అయిపోయింది.

ఇక ఈ ఆడియ్లో ముఖ్యంగా “నిన్ను వెనక్కి నుంచి వచ్చి గట్టిగా కౌగిలించుకుందాం అనుకున్నా” అనే డైలాగ్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పటికే టిక్ టాక్ లాంటి సోషల్ మీడియాలో కామెడీగా వాడేస్తున్నారు. ఇటీవలే జబర్దస్త్, అదిరింది షోలో ఆర్టిస్టులు కూడా స్కిట్లో బాగంగా ఈ డైలాగ్ ను తేగా వాడేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ డైలాగే ఫేమస్ అయిపోయింది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు చూడండి.

https://www.youtube.com/watch?v=g-4oMweBevI

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -