ఎన్నికల సమయంలో టీడీపీలో వింత పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ కోసం కొందరు నేతలు నానా అవస్థలు పడుతుంటె…టికెట్ దక్కిన నేతలు మాత్రం పోటీ చేయకుండా టికెట్ మాకు వద్దు బాబోయ్ అంటూ పలాయనం చిత్తగిస్తున్నారు. అసలు విషయానికి వస్తే….తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వాలు ఖరారు అయ్యాకా ఒక్కోరు తమకు టికెట్ వద్దని – తాము పోటీలో ఉండాలని అనుకోవడం లేదంటూ సదరు నేతలు ప్రకటనలు చేస్తూ బాబుకు షాక్ ఇస్తూ ఉన్నారు.
మొన్న రఘురామకృష్ణం రాజు – ఆ తర్వాత బుడ్డా రాజశేఖర రెడ్డి.. ఇప్పుడు మరో అభ్యర్థి చేతులెత్తేసినట్లు సమాచారం. నరసాపురం ఎంపీ టికెట్ ను రఘురామకృష్ణం రాజుకు బాబు కేటాయించినా వద్దని వైసీపీ టికెట్ మీద పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తెర్లాం పూర్ణం పోటీ చేయకుండా చేతులెత్తేశారు. నామినేషనే తరువాయి అనుకుంటుంటే.. ఈ దశలో తను పోటీ చేయాలని అనుకోవడం లేదని ప్రకటించినట్లు సమాచారం. టీడీపీ నేతలకు ఆయన అందుబాటులో లేకుండా అజ్ణాతంలోకి వెల్లినట్లు సమాచారం.
ఇన్ని రోజులూ టికెట్ కావాలని – చివరకు టికెట్ దక్కాక ఇలా చేస్తుండే సరికి తెలుగుదేశం పార్టీలో రచ్చ రేగుతూ ఉందట. ఐవీఆర్ ఎస్ పద్ధతిలో సర్వే చేసి సైతం చంద్రబాబు నాయుడు ఈయనకు టికెట్ ను కేటాయించారట. వేరేవాళ్లకు కాదని టికెట్ ఆయనకు కేటాయిస్తే చివరిలో పోటీ చేయనని చేతులెత్తేయడం ఆ పార్టీని కలవర పెడుతోంది.