Saturday, April 20, 2024
- Advertisement -

అబ‌ద్దాలు చెప్ప‌డం మోదీకి అల‌వాట‌య్యింది…రాహుల్‌

- Advertisement -

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రో సారి మాట‌ల తూటాలు ఎక్కుపెట్టారు. మోదీ ఎక్క‌డ‌కు వెళ్లినా అబ‌ద్దాలు చెప్ప‌డం ఆయ‌న నైజం అని విమ‌ర్శించారు. ఢిల్లీలో చంద్ర‌బాబు త‌ల‌పెట్టిన ధ‌ర్మ‌పోరాట దీక్ష‌కు రాహుల్‌, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా మద్దతు ప్రకటించారు. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకీ ఇచ్చిన హామీల‌ను అన్నింటినీ వెంట‌నే అమ‌లు చేయాట‌ల‌ని డిమాండ్ చేశారు. ఏపీ భవన్‌లో దీక్షా స్థలానికి చేరుకున్న ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఏపీకి వెళ్లిన మోదీ ప్రత్యేక హోదాపై కూడా అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. ప్రధానిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత మోదీకి లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రానికి జరగాల్సిన న్యాయం నిమిషాల్లో జరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రధాని చౌకీదార్‌ చోర్‌గా మారారని విమర్శించారు. ఏపీ ప్రజల నుంచి తీసుకున్న డబ్బును అనిల్ అంబానీ ఖాతాలోని మళ్లించారని ఆరోపించారు. మోడీకి మరోసారి ప్రధాని అయ్యే అర్హతలేదన్న రాహుల్‌.. మరో రెండు నెలలో ఆయన ఆ హోదాలో ఉండబోతున్నారని చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -