ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ప్రతిపక్ష పార్టీనుంచి అధికార పార్టీలోకి వలసలు ఊపందుకుంటాయి. కానీ విచిత్రంగా రాష్ట్రంలో అధికార పార్టీ టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగలనుంది. త్వరలో జరిగే ఎన్నికల్లో జగన్కు సొంత జిల్లాలో ఆధిపత్యాన్ని తగ్గించాలని చూస్తున్న బాబు పప్పులు ఉడకడంలేదు కదా….ఎదరు దెబ్బలు తగులుతున్నాయి.
టీడీపీ నేత, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి త్వరలోనే వైసీపీలో చేరబోతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాజంపేట వైసీపీ నేతలతో ఈ విషయమై మాట్లాడిన మల్లికార్జున రెడ్డి, విజయసాయిరెడ్డితో ఓసారి చర్చించాక వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర తరువాత జగన్ సొతజిల్లాపై దృష్టిపెట్టారు. ఇప్పటికే రెండు నియోజక వర్గాలు అభ్యర్తులను ప్రకటించి దూకుడు మీదున్న జగన్…టీడీపీ ఆయుపట్టుపై దెబ్బ కొడుతున్నారు.
టీడీపీలో తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతోనే మేడా మల్లికార్జునరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.మేడా మల్లిఖార్జున్ రెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై కుటుంబసభ్యులతో మల్లిఖార్జున్ రెడ్డి చర్చించినట్టు సమాచారం. కుటుంబసభ్యులు కూడ మల్లిఖార్జున్ రెడ్డిని పార్టీ మారాలని ఒత్తిడి తీసుకొచ్చినట్టు ప్రచారం సాగుతోంది. జగన్ విదేశీ పర్యటనకు ముందే పార్టీలో చేరే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మల్లికార్జున రెడ్డికి వైసీపీలో చేరితే ఏ బాధ్యత అప్పగిస్తారన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.