రాజకీయ పార్టీ స్థాపనపై అభిమానులతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్న తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఫ్యాన్స్కి బారీ షాక్ ఇచ్చారు.ఎన్నికలు సమీపిస్తున్న తరునంలో రాజకీయాలపై దృష్టిసారించిన ఆయన త్వరలో పార్టీ నిర్మానంపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో అభిమానులకు ఝలక్ తగిలినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అభిమాన సంఘాల నిర్వాహకులతో శనివారం ఆయన వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజలకు సేవ చేసేందుకు పార్టీలో చేరాలని సూచించిన రజనీకాంత్.. ఎవరు పోటీ చేయాలనే నిర్ణయాన్ని మాత్రం తానే తీసుకుంటానని…పార్టీ తరపున ఫ్యాన్స్ సీట్లు ఆశించొద్దనే ఆయన అభిమాన సంఘాలకు స్పష్టం చేశారంట. ఈ విషయాన్ని రజనీ ఫ్యాన్స్ క్లబ్ ప్రతినిధి ఒకరు శనివారం ధృవీకరించారు.
సుదీర్ఘంగా అభిమానులుగా ఉన్నవాళ్లు, ఫ్యాన్స్ కమిటీ చైర్మన్లు, ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్లు టికెట్లు ఆశించొద్దని మొన్నీమధ్య జరిగిన సమన్వయ కమిటీలో రజనీ తేల్చి చెప్పారు. అయితే ఈ నిర్ణయంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. దీనిపై త్వరలో చర్చించాలని భావిస్తున్నాం’ అని సదరు ప్రతినిధి వెల్లడించారు.