Saturday, April 20, 2024
- Advertisement -

తండ్రి మృతదేహాన్ని చూడకుండానే వెనుదిరిగి అమృత.. ఎందుకు ?

- Advertisement -

అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలు మిర్యాలగూడలోని శ్మశాన వాటికలో జరుగుతున్న వేళ.. తండ్రిని చూసేందుకు అక్కడకు ఆమృత వెళ్లింది. అయితే ఆమె అక్కడకు చేరుకోవడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణ పరిస్థితి ఏర్పడింది.

తండ్రిని తుదిసారి నివాళులు అర్పించాలంటూ, తనవారితో కలిసి పోలీసు వాహనంలో అమృత అక్కడికి రావడంతో.. మారుతీరావు బంధుమిత్రులు వాహనాన్ని అడ్డుకున్నారు. అమృత రావడానికి వీల్లేదంటూ నినాదాలు చేశారు. ’మారుతీరావు అమర్ రహే’, ‘అమృత గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. కనీసం తల్లిని పలకరించేందుకు కూడా ఆమె రాలేదని కేకలు వేశారు.

దాంతో ఆమె తండ్రి మృతదేహాన్ని చూడకుండానే.. క్షణాల వ్యవధిలోనే ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇరు వర్గాలకూ నచ్చజెప్పిన పోలీసులు, బందోబస్తు మధ్యే అమృతను తిరిగి ఇంటికి చేర్చారు. ఆపై మారుతీరావు సోదరుడు శ్రవణ్ తన అన్న అంత్యక్రియలు నిర్వహించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -