Friday, March 29, 2024
- Advertisement -

తాట తీస్తా…రాజేంద్రప్రసాద్‌కు పృథ్వీ ఘాటు వార్నింగ్

- Advertisement -

ఏపీ సీఎం జగన్ ను నమ్ముకున్న వాల్లకోసం ఎంతదూరం అయినా వెల్తారు. వారికోసం ఎలాంటి రిస్కు అయినా తీసుకుంటాడు. నమ్మిన వాళ్లకు సముచిత స్థానం కల్పించడం జగన్ నైజం. ఇపుడు జగన్ కోసం కూడా తాము ఎందాకైనా వెళ్తామనే వారు కనిపిస్తున్నారు.

వారిలో సినీ సీమ నుంచి వచ్చిన కమెడియన్ ప్రుధ్వి ఎపుడు ముందు వరసలో ఉంటారు. థ‌ర్టీ యియర్స్ ఇండస్ట్రీగా పేరు సంపాదించుకున్నారు. జగన్ అంటే పిచ్చి అభిమానం. వైసీపీ అధికారంలోకి రాగానె ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీవిని ఇచ్చారు.

అదికార పార్టీ టీడీపీ వైపు పోకుండా అధికారంలేని జగన్ తో కలిసి నడవారు. పాదయాత్రలో కూడా జగన్ తో నడిచారు. ఎన్నిక సమయంలో తన పార్టీకోసం తన వంతు ప్రచారం నిర్వహించారు. ప్రుధ్వీ జగన్ మీద ఎంత అభిమానం అంటే జగన్ని ఎవరైనా ఏమైనా అంటే తాట తీస్తానంటూ ముందుకు వస్తున్నారు.

కొద్ది రజుల క్రితం జగన్ సీఎం అవడం ఇండస్ట్రీ పెద్దలకు ఇష్టం లేదనె వ్యాఖ్యలు చేశారు. ఆవ్యాఖ్యలకు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ స్పందింస్తూ కొత్త ముఖ్యమంత్రి అయితే వారిని కళాకారులు ఖచ్చితంగా కలవాలనే రూల్ ఏమీ లేదని కామెంట్ చేశారు.

ఈ వ్యాఖ్యలపై నటుడు పృథ్వీ ఘాటుగా స్పందించారు. సినీ పరిశ్రమ ప్రముఖులు, టాలీవుడ్ పెద్దల గురించి తాను ఏమీ తప్పుగా మాట్లాడలేదని నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ క్లారిటీ ఇచ్చారు. ఏపీ సీఎంగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టాలీవుడ్ పెద్దలు కలిసి శుభాకాంక్షలు చెప్పాలని మాత్రమే తాను కోరారని ఆయన స్పష్టం చేశారు.

చంద్రబాబు సీఎం అయిన వెంటనే సత్కారాలు చేసిన సినీ పెద్దలు జగన్ ముఖ్యమంత్రి అయితే కనీసం కలవడానికి కూడా రాకపోవడం ఏమిటని అన్నారు. వైఎస్ హయాంలో చాలా మంది సినిమా వాళ్లు ఆయన నుంచి లబ్ది పొందారని పృథ్వీ వ్యాఖ్యానించారు. జగన్‌ను ఎవరు విమర్శించినా తాట తీస్తానని పృథ్వీ వార్నింగ్ ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -