Thursday, April 25, 2024
- Advertisement -

ఏపీలో కరోనా వల్ల ఒక్క రోజులో 17 మంది మృతి..!

- Advertisement -

ఏపీలో కరోనా రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏపీలో కరోనా కారణంగా మరణాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక్క రోజులో 17 మంది కరోనా కారణంగా చనిపోయారు.

కర్నూలు జిల్లాలో నలుగురు, గుంటూరు జిల్లాలో ముగ్గురు, విజయనగరం జిల్లాలో ముగ్గురు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఒకరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. దాంతో ఏపీ మర్ణాల సంఖ్య 309 దాటింది. ఇక కొత్తగా ఒక్క రోజులో 1,813 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

అత్యధికంగా అనంతపురం జిల్లాలో 311 కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 300, కర్నూలు జిల్లాలో 229, శ్రీకాకుళం జిల్లాలో 204 కేసులు వచ్చాయి. గడచిన 24 గంటల్లో 1,168 మందిని డిశ్చార్జి చేశారు. దాంతో ఇప్పటివరకు కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 14,393కి పెరిగింది. ఓవరాల్ గా 27,235 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇంకా 12,533 మంది చికిత్స తీసుకుంటున్నారు.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం : ఇంటికే ఐసోలేషన్ కిట్

జగన్ ను తక్కువ అంచనా వేసిన సోనీయా గాంధీ..!

జగన్ నిర్ణయం.. విడుదల రజినికి గుడ్ న్యూస్..?

ఎమ్మెల్యే పదవికి వల్లభనేని రాజీనామా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -