Wednesday, April 24, 2024
- Advertisement -

బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్..!!

- Advertisement -

అంతర్వేది లో జరిగిన ఘటన ను ప్రతిపక్షాలు చాలా సీరియస్ గా తీసుకుంది.. ప్రతిష్టాత్మక మైన , ఘణ చరిత్ర కలిగిన రథాన్ని దగ్ధం చేసే విషయంలో ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా ఉండడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారు.. కాగా సోము వీర్రాజు నాయకత్వంలో పెద్ద ఆందోళనకు దిగాలని యోచించారు.. కానీ దాన్ని పోలీసులు దాన్ని భగ్నం చేసి వారిని హౌస్ అరెస్ట్ చేశారు..

అంత‌ర్వేది ఘ‌ట‌నతో తూర్పుగోదావ‌రి జిల్లాలో ఉద్రిక్త ప‌రిస్థితి నెలకొనడంతో ఆందోళన చేస్తామని చెప్పిన పలువురిని గృహ దిగ్భంధం చేసినట్లు పోలీసులు తెలిపారు.. లేశ్వ‌రం, తునిలో ఉద‌యం 4 గంట‌ల నుంచే పోలీసులు బీజేపీ నేత‌ల‌ ఇళ్ల‌ వ‌ద్ద‌కు చేరుకున్నారు. పోలీస్ స్టేష‌న్‌కు రావాలంటూ వారిని బ‌ల‌వంత‌పెట్టారు. అందుకు ఒప్పుకోక‌పోవ‌డంతో వారిని హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు స‌హా ప‌లువురు ముఖ్య నేత‌లు గృహ నిర్బంధం చేసిన వారిలో ఉన్నారు.

మ‌రోవైపు అంతర్వేది పరిసర ప్రాంతాలలో 30- పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని ఏలూరు రేంజ్ డీఐజీ తెలిపారు. ఇత‌రులెవ‌రూ ఈ ప్రాంతానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. ప్ర‌జ‌లు, పార్టీలు సంయ‌మ‌నంతో ఉండాలని కోరారు. నిబంధ‌న‌లు అతిక్రమిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -