Wednesday, April 24, 2024
- Advertisement -

పార్క్ హయత్ రహస్య భేటీ కుట్ర కోసమే : అంబటి రాంబాబు

- Advertisement -

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్, బీజేపీ నేతలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ ల హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో రహస్య భేటీ అవ్వడంపై విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ బేటీపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. ఈ ముగ్గురు ప్రభుత్వంకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు అంబటి. చంద్రబాబే వీరి భేటికి సూత్రధారి అని ఆరోపించారు.

సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ బీజేపీలో ఉన్నప్పటికీ టీడీపీ కోసం ఏం చేయడానికైన సిద్దంగా ఉన్నారని అన్నారు. వ్యవస్థలను అనైతికంగా వాడుకోవడం చంద్రబాబుకు అలవాటేనని అంబటి విమర్శించారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు ముందుంటారని అన్నారు. ఈ భేటీతో నిమ్మగడ్డ దుర్మార్గపు వ్యక్తిత్వం బయటకు వచ్చిందని చెప్పారు. నిమ్మగడ్డ బండారాన్ని బయట పెట్టేందుకు ఎంత దూరమైనా వెళ్తామని అన్నారు. హోటల్ లో జరిగిన భేటీలో ఈ ముగ్గురూ కలిసి ఎవరితో మాట్లాడారో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ముగ్గురి భేటీపై టీడీపీ అధినేత చంద్రబాబు జవాబు చెప్పాలని అన్నారు.

ఇది ఇలా ఉంటే ఈ క్రమంలో ఆ సమావేశంపై సుజనా చౌదరి క్లారిటీ ఇచ్చారు. ఆ భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని. అందులో తప్పులేదని.. అర్ధం లేని వీడియో టేపులతో వైసీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేరస్తుడు కాదని, ఆయన్ను కలవకూడదని రూల్ లేదని ఆయన తెలియజేశారు. తాము మంచి మిత్రులమని.. తమకు ఎక్కడైన కలుసుకునే స్వేచ్చ ఉందని.. ఇది తప్పు కాదని.. వైసీపీ నేతలు ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని సుజనా చౌదరి అన్నారు.

అచ్చెం నాయుడు ఆరోగ్యంపై జగన్ సంచలన నిర్ణయం..?

ప్రజల డబ్బు పందికొక్కుల్లా తిన్నా.. వదిలేయాలా..?

అచ్చెన్నాయుడి అరెస్ట్ కు ముందు ఏం జరిగిందో చెప్పిన ఆయన భార్య..!

జగన్ న్యూ ప్లాన్.. టీడీపీకి ఎన్టీఆర్ పేరుతో చెక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -