- Advertisement -
టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన చలో ఆత్మకూరు కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. పల్నాడులో ఎటువంటి సంఘటను జరకుండా పోలీసులు బందోబస్తు చేశారు. బాబుతో పాటు నారాలోకేష్ ఇతర నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ లైపై లోకేష్ ఘాటుగా స్పందించారు.
ప్రజాస్వామ్యానికి నేడు చీకటి రోజు అని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అభిప్రాయపడ్డారు. వైసీపీ గుండాగిరికి నిరాశ్రయులైన వారికి న్యాయం చేయాల్సిందిపోయి.. ప్రభుత్వ వైఫల్యంపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయించి వికృతానందం పొందుతున్నారని విమర్శించారు.