Wednesday, April 24, 2024
- Advertisement -

బీజేపీలోకి టీడీపీ ఫైర్ బ్రాండ్లు …మరి లోకేష్ సంగతి…?

- Advertisement -

ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల తర్వాత టీడీపీ పరిస్థితి ఘోరంగా తయారయ్యింది. కేవలం 23 సీట్లకే పరిమితం కావడంతో పార్టీ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో బంపర్ మెజారిటీతో గెలిచిన వైసీపీ ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించకపోవడంతో అసంతృప్త నేతలంతా బీజేపీ వైపు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమ సత్తా చాటాలని చూస్తున్న కమలం ఇతర పార్టీల నేతలపై గురి పెట్టింది. దీనిలో భాగంగా ఆపరేషన్ కమలంను స్టార్ట్ చేసింది.

ఏపీలో బలమైన పక్షంగా ఎదగాలని వ్యూహరచన చేస్తున్న కమలనాథులు కూడా వలసదారులను శక్తిమేర ప్రోత్సహిస్తున్నారు. టీడీపీలో ఫైర్ బ్రాండ్లుగా పేరుపొందిన సాదినేని యామిని, దివ్యవాణి కూడా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది నేతలు కాషాయ కండువా కప్పుకున్నారు.

పదునైన వ్యాఖ్యలతో ఫైర్ బ్రాండ్ గా టీడీపీలో గుర్తింపు పొందింది సాధినేని యామిని, నటి దివ్యవాణి. ముఖ్యంగా నోటిదురుసే యామినికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యామిని పరుషపదజాలంతో రెచ్చిపోయారు. ప్రత్యేకించి సోషల్ మీడియాలో ఈమె పేరు మార్మోగింది.

ఈ క్రమంలోనే ఆమెకు అధికార ప్రతినిధిగా హోదా ఇచ్చారు. దాంతో మరింత విజృంభించిన యామిని జనసేనాని పవన్ కల్యాణ్ పై భారీ స్థాయిలో విరుచుకుపడింది. పవన్-మల్లెపూలు ఎపిసోడ్ తో ఆమెకు ఎక్కడలేని పాప్యులారిటీ ఇచ్చింది . తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో సైలెంట్ అయిపోయింది.

కొన్నిరోజుల క్రితం యామిని సాదినేని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో యామిని బీజేపీలోకి చేరబోతోందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. మొన్నటి వరకూ టీడీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని హద్దూ అదుపుల్లేకుండా మాట్లాడిన ఈమె ఉన్నఫలంగా భాజాపా నేతలతో కనిపించడం ఆశ్చర్యకరమైన అంశంగా మారింది. లోకేష్ భజన చేస్తూ బీజేపీని తిట్టిన ఈమె ఆ పార్టీలోకి చేరబోతున్నట్టేనా? ఇలాంటి ఫాలోవర్స్ పార్టీ మారిపోతే అప్పుడు లోకేష్ పరిస్థితి ఏమిటి? అనే అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది.

ఇక దివ్యవాణి కూడా చాలాకాలంగా మీడియా ముందుకు రావడంలేదు. ఎన్నికల ముందు వైసీపీ నేతలను, ప్రధాని మోదీని తన వ్యాఖ్యలతో కడిగిపారేసింది. ఈమె కూడా టీడీపీ ఓడిపోవడంతో మీడియా ముందుకు రావడం మానేసింది.మె కూడా బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఇదంతా బాబు మార్గనిర్దేశ కత్వంలో నడుస్తుందనే టాక్ వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -