Thursday, March 28, 2024
- Advertisement -

జగన్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ఆది..

- Advertisement -

సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా టీడీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. వైసీపీ నుంచి గెలిచి టీడపీలోకి ఫిరాయించిన ఆదికి బాబు మంత్రి పదవి కట్టబెట్టారు.అంతే ఇంకేముంది జగన్ పై రెచ్చిపోయి ఇస్టమొచ్చినట్లు మాట్లాడారు. తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడంతో ఆది సైలెంట్ అయిపోయారు. టీడీపీలోనె కొనసాగితే తన రాజకీయ భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని జగన్ ప్రభుత్వం నుంచి తప్పించుకోవాలంటే భాజాపా లో చేరడం ఒక్కటే మార్గం. అందుకే ఆయన భాజాపాలో రేపు చేరుతున్నారు.

ఇప్పటి వరకు బహిరంగం ప్రకటించని ఆదినారాయణ రెడ్డి తాజాగా స్పందించారు. తాను భాజాపాలో చేరుతున్నట్లు ప్రకటించారు.ఈ విషయం బాబుకు ముందే చెప్పానని తెలిపారు.తెలుగుదేశం పార్టీతో తనకు విభేదాలు లేవని… స్థానిక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయని… జగన్ దాష్టీకాలను ఎదుర్కోవాలంటే బీజేపీలాంటి గట్టి పార్టీ అవసరమని తెలిపారు.

తన అనుచరుల కోసమే పార్టీ మారుతున్నానని చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరాలా? లేదా తన నియోజకవర్గంలో బహిరంగసభ ఏర్పాటు చేసి చేరాలా? అనే విషయంపై ఈరోజు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -