- Advertisement -
టీడీపీ అధినేత బాబుకు వరుస దెబ్బలతో అల్లాడిపోతున్నారు. ప్యామిలీతో యూరప్ పర్యటనలో బాబు ఉంటె ఇక్కడ మాత్రం ఇతర పార్టీలు టీడీపీని కబ్జా చేస్తున్నారు. ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులు భాజాపా తీర్థం పుచ్చుకుంటె తాజాగా మరో సీనియర్నేత కాషాయ కండువా కప్పుకున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన సీనియర్ నేత… అంబికా కృష్ణ ఇవాళ టీడీపీకి గుడ్ బై చెప్పి భాజాలో చేరారు. ఢిల్లీలోరామ్మాధవ్.. అంబికా కృష్ణకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అంబికా కృష్ణ వెళ్లిన తర్వాత… మరిన్ని వికెట్లు పడతాయనీ, బీజేపీ చెబుతున్నట్లు ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ చాలా జోరుగా సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. త్వరలో కొందరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరబోతున్నారని సమాచారం.