Friday, April 19, 2024
- Advertisement -

వైసీపీలోకి మాజీ మంత్రి…

- Advertisement -

టీడీపీనుంచి ప్ర‌తిప‌క్ష పార్టీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. నామినేష‌న్ల ప్ర‌క్రియ ముగుస్తున్నా నేత‌లు మాత్రం బాబుపై న‌మ్మ‌కం లేక వైసీపీ గూటికి చేరుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, ప్ర‌స్తుతం కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఉన్న కొత్త ప‌ల్లి సుబ్బారాయుడు వైసీపీలో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు.

గతంలో వైసీపీలో ఉన్న కొత్తపల్లి టీడీపీలోకి వెల్లారు. అనంత‌రం కాపు కార్పొరేష‌న్ ఛైర్మెన్‌గా నియ‌మించారు బాబు. త్వ‌ర‌లో జరగనున్న ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంలో మనస్తాపానికి గురైన కొత్తపల్లి కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ఆయన వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజుతో ఈ మేరకు చర్చించారని సమాచారం. టీడీపీకి రాజీనామా చేసి ఆయన రేపు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నరసాపురం నుంచి 2004లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచారు. అయితే, 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. టీడీపీ నుంచి న‌ర‌సాపురం టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -