- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో భారీ ఎదరుదెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు నేతలు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరందరికీ వైఎస్ జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎన్నికల దగ్గర సమయంలో సొంతజిల్లాలో పార్టీని నేతలు వీడుతుండటంతో పార్టీనేతల్లో కలవరం మొదలైంది. మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో చిత్తూరు బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్ సురేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, టీడీపీ కార్పొరేటర్లు నవీన ఇందు, శ్రీకాంత్, సహదేవన్, చంద్రయ్య, డేవిడ్, ముత్తయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వేలంగాని, ఎంపీటీసీ రాధమ్మ, ఇండిపెండెంట్ కార్పొరేటర్ లతా శ్రీధర్ తదితరులు పార్టీలో చేరారు.