అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. మొదటి నుంచి వలసలను ప్రోత్సహించిన బాబు అదే వలసలు ఇప్పుడు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. వైసీపీనుంచి 24 మంది ఎమ్మెల్యేలను ఆకర్ష్ పేరిట టీడీపీ తన పార్టీలో చేర్చుకుంది. అందులో కొందరికి మంత్రి పదువులు కూడా కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
బాబు పాలు పోసి పెంచిన ఫిరాయింపు పామే ఇప్పుడు బాబును వెంటాడుతోంది. ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఇద్దరు ఎంపీలు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎన్నికల సమయానికి దాదాపు టీడీపీలో ఉన్న సగం మంది వైసీపీగూటికి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తాజాగా మరో ఎమ్మెల్యే, మరో మంత్రి వైసీపీ గూటికి చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీ ట్రిబుల్ షూటర్ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి చర్చలు కూడా పరిపినట్లు తెలుస్తోంది.
మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వస్తుండటం టీడీపీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేత మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే, టీడీపీకి నష్టం అధికమేనని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి, మరో వైపు వలసలను ఆపాలని సీఎం ఎంత ప్రయత్నాలు చేస్తన్నా ఆగడంలేదు.
మంత్రితో పాటు మరో ఎమ్మెల్యే కుకూడా వైసీపీ గాలం వేస్తోంది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎమ్మెల్యేతో వైసీపీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే.. వైసీపీలో చేరేందుకు ఆ ఎమ్మెల్యే ఓ కండిషన్ పెట్టారట. తనతో పాటు తన కొడుక్కి కూడా టికెట్ ఇవ్వాలని కండీషన్ పెడుతున్నారంట. రెండు టికెట్లు అంటే కష్టం.. ఒక టికెట్ అయితే ఇస్తామని వైసీపీ నేతలు చెప్పారట. ప్రస్తుతం చర్చలు జరుగుతన్నాయి. సఫలమైతే టీడీపీ నుంచి మరో వికెట్ పడనుంది.