ఎన్నికల్లో టీడీపీఓటమి పాలయినా మాజీ సీఎం చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి రాజకీయ పరిస్థితులు. జగన్ కంటె ఇప్పుడు బాబుకు భాజాపా బెంగ పట్టుకుంది. ఫిరాయింపులు ప్రోత్సహించనని జగన్ హామీ ఇచ్చినా భాజాపా మాత్రం నిస్సిగ్గుగా ఫిరాయింపులకు తెరలేపింది. ఇప్పటికే పలువురు నేతలు కషాయ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు బాబు.
సొంత పార్టీనేతలె బాబును తెగ ఇబ్బంది పెండుతున్నారు. పార్టీ నుంచి నెక్ట్స్ వికెట్ ఎవరుంటారనె చర్చ పార్టీలో అలజడిరేపుతోంది. గత కొద్దిరోజులుగా విజయవాడ ఎంపీ కేశినేని బాబును, ఇతర నేతలను టార్గెట్ చేస్తూ ట్విట్టర్లో ట్వీట్లు చేస్తున్నారు. మీ పెంపుడు కుక్కను కంట్రోల్ చేయాలంటూ ఏకంగా పార్టీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి కేశినేని నాని ట్వీట్ చేయడం టీడీపీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. అయినా కూడా బాబు ఏం చేయలేని దుస్థితిలో ఉన్నారు.
భాజాపాలోకి కీలక నేతలు క్యూకడుతున్నారు. ఇప్పటికె భాజాపా నేత రామ్ మాధవ్ రాయపాటి సాంబశివరావుతో చర్చలు జరిపారు. త్వరలోనె ఆయన ఢిల్లీ వెల్లి భాజాపాలో చేరనున్నారు. మరో వైపు కేశినేని నాని వ్వవహారం చూస్తుంటె ఆయన కూడా త్వరలోనె బాబుకు హ్యాండ్ ఇవ్వనున్నారనె వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీ ఖాలీ అవుతుందని భాజాపా అధ్యక్షుడు కన్నా చసిన వ్యాఖ్యలు చూస్తె ఇంకెంత మంది పార్టీని వీడేందుకు సిద్దంగా ఉన్నారో అర్థం అవుతోంది.