Thursday, April 25, 2024
- Advertisement -

తెలుగు తమ్ముళ్ళకు చంద్రబాబు అసలు రూపం తెలిసిపోయిందా..!!

- Advertisement -

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్ యా వెంకటేశ్వర స్వామిని కొలిచేవిధంగా కొలిచారు తెలుగు తమ్ముళ్ళు. చంద్రబాబు, లోకేష్ లు ఆ అండ చూసుకుని వారి ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగింది.. ఇప్పుడు యా పరిస్థితి కనపడట్లేదు. చంద్రబాబు లాంటి వ్యక్తి , నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి రాజకీయాల్లో బుడి బుడి అడుగులేసిన జగన్ లాంటి నాయకుడి చేతిలో ఓటమి పాలు కావడంతో తెలుగు తమ్ముళ్ళు షాక్ తిన్నారు.. అయితే జగన్ వచ్చీ రాగానే టీడీపి లో ఉన్న అవినీతి ని వెలికి తీసే కార్యక్రమం మొదలు పెట్టారు.. 

అచ్చెన్నాయుడు, జేసి ప్రభాకర్ వంటి నాయకులూ కోట్ల లలో స్కాం లు చేసి ఇప్పుడు కటకటాల పాలయ్యారు. మరికొందరికి జగన్ ముహూర్తం సిద్ధం చేసి ఉంచారు.. ఇప్పటికే సిబిఐ విచారణ మొదలుపెట్టింది. ఎవరిని వదిలిపెట్టేది లేదని జగన్ సంకల్పించారు.. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడ్డ నేతలతో పాటు పాటు, ఇతర తెలుగు తమ్ముళ్ళలో అంతర్మథనం జరుగుతోంది రాజకీయ వర్గాల టాక్‌. గొప్ప గొప్ప నేతలుగా వారిని చూసిన తమ్ముళ్ళ కళ్ళు ఇప్పుడ వారు అలా గమ్మున కూర్చోవడం చుదలేకపోతున్నాయి.. 

పార్టీ అధినేతలు చెప్పిన ప్రతి పనినీ చేసామని, ఎవరిని తిట్టమంటే వారిని ఏ కారణం లేకుండానే తిట్టిపోసామని, అయినప్పటికీ తమకు ఇబ్బందులు ఎదురైనప్పుడు తమకు అన్ని విధాలా సహాయంగా ఉండాల్సినప్పటికీ తమ పార్టీ అధినేతలు పూర్తిస్థాయిలో పట్టించుకోలేదన్నది సదరు ‘సొంత నాయకుల’ బాధితుల అభిప్రాయంగా చెబుతున్నారు. వాస్తవానికి ఈ ఇద్దరు నాయకుల వ్యవహారంలోనూ ప్రారంభంలో చేసిన హడావిడి ఆ తరువాత టీడీపీ నాయకులు చేయకపోవడాన్ని ఇక్కడ ఉదహరిస్తున్నారు. తమకు అనుకూలంగా ఉంటుందేమోనన్న ఉద్దేశంతో ముందులో కాస్తంత ఫోకస్‌ పెట్టినప్పటికీ, ఆ తరువాత పెద్దగా పట్టించుకున్న దాఖలాల్లేవన్నది వారి వాదన. తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైన వ్యక్తులుగా చెలామణీ అయిన నాయకుల పట్లే చంద్రబాబు, లోకేష్‌ నాయుడుల స్పందన ఈ విధంగా ఉంటే మిగిలిన వారి సంగతేంటన్న అంతర్మథనం వారిలో ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -