Thursday, April 25, 2024
- Advertisement -

బాబు యాక్టివ్.. షాకిస్తున్న టీడీపీ సీనియర్లు

- Advertisement -

టీడీపీలో ఇప్పుడు ఆశ్చర్యకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఘోర ఓటమి భారాన్ని దిగమింగుకొని 70 ఏళ్ల చంద్రబాబు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. అసెంబ్లీలో అధికార వైసీపీతో సై అంటే సై అంటూ దూకుడుగా ముందుకెళ్తున్నారు. కానీ టీడీపీ హయాంలో వెలుగు వెలిగి జగన్ ను దుమ్మెత్తిపోసిన నాటి మంత్రుల జాడ మాత్రం ఇప్పుడు టీడీపీలో కనిపించకపోవడం టీడీపీని, చంద్రబాబును షాక్ కు గురిచేస్తోంది.

ప్రస్తుతం అసెంబ్లీలో చంద్రబాబుపై జగన్ సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒంటికాలిపే లేస్తూ శివాలెత్తుతున్నారు. చంద్రబాబు దీన్ని బాగానే తిప్పికొడుతున్నారు. బాబు తర్వాత టీడీపీలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి.. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.

కాగా టీడీపీ హయాంలో మంత్రులుగా చేసి అధికారం వెలగబెట్టిన గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి, బొజ్జల, పల్లె రఘునాథ్ రెడ్డి, మృణాళిని, నారాయణ, సునీత, కామినేని, పీతల సుజాత సహా చాలా మంది అస్సలు యాక్టివ్ గా ఉండడం లేదు. కనీసం బయటకొచ్చి వైసీపీ చర్యలపై ఖండిచండం లేదు… ప్రతిస్పందించడం లేదు

ఇలా బాబు మాత్రమే అన్ని దిగమింగుకొని టీడీపీపై పోరుబాట పట్టగా.. బాబు గత ప్రభుత్వంలోని మంత్రవర్గ సహచరులు ఇంకా కోలుకోకుండా పార్టీలో యాక్టివ్ కాకుండా ఉండడం టీడీపీని కలవరపాటుకు గురిచేస్తోంది. చంద్రబాబు తేరుకున్నా ఇంకా పాత మంత్రులు మాత్రం అటు వైపే చూడకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -