- Advertisement -
కేసీఆర్పై పోటీ చేసి ఓడిన కాంగ్రెస్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి గులాబీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. ప్రతాప్రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వంటేరు అనుచరులు కూడా పార్టీలో చేరారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఆయన మూడుసార్లు పోటీ చేశారు.
2014, 2018 ఎన్నికల్లో సీఎం కేసీఆర్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు తాను తెరాసలో చేరానని, నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరుతున్నట్లు వంటేరు చెప్పారు.