Tuesday, April 16, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ వ‌ల్లే ఓడిపోయాం: జ‌గ్గారెడ్డి..

- Advertisement -

తెలంగాణాలో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో మ‌హాకూట‌మి ఘోరంగా ప‌రాజ‌యాన్ని చ‌విచూసింది. అధికారంలోకి వ‌స్తామ‌ని ప్ర‌గ‌ల్బాలు ప‌లికిన నేత‌ల‌కు కేసీఆర్ షాక్ ఇచ్చారు. అసెంబ్లీలో క‌నీసం ప్ర‌తిప‌క్ష హోదాకూడా రాని ప‌రిస్థితి కూట‌మిది. ఇద‌లా ఉంటే సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ‌లో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగానే తెలంగాణలో ప్రజాకూటమి(మహాకూటమి) ఓడిపోయిందని వ‌స్తున్న వ్యాఖ్య‌లు సరికాదన్నారు. తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఈ సారి సీఎల్పీ నేత‌గా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ హైకమాండ్ ను కోరుతున్నట్లు తెలిపారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో టీడీపీతో పొత్తు ఉండాల్సిందేన‌ని చెప్పారు. మెద‌క్ పార్ల‌మెంట్ స్థానాన్ని త‌న భార్య‌కు ఇస్తే గెలిపించు కొనే బాధ్య‌త తాను తీసుకుంటాన‌న్నారు. చంద్రబాబు తెలంగాణలో ప్రచారం చేయడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి, వైసీపీ అధినేత జగన్ మద్దతుదారులు టీఆర్ఎస్ కు భారీగా క్రాస్ ఓట్లు వేశారనీ, అందువల్లే ఎక్కువగా నష్టపోయామని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -