Saturday, April 20, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌…కేసీఆర్‌పై పోటీ చేసిన నేత టీఆర్ఎస్‌లోకి..

- Advertisement -

తెలంగాణాలో కాంగ్రెస్‌కి బిగ్ షాక్ త‌గ‌ల‌నుంది. గ‌జ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసిన ఒంటేరు ప్ర‌తాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ద‌మ‌య్యారు. రేపు సాయంత్రం ఆయన సీఎం కేసీఆర్‌ సమక్షంలో తెరాస కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఒంటేరు తెరాసలో చేరే విషయాన్ని ఆయన కుమారుడు ధ్రువీకరించారు.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున గజ్వేల్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రతాప్‌ రెడ్డి బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ చేతిలో రెండు సార్లు ఓట‌మి పాల‌య్యారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించాల‌ని రెడీ అవుతున్నారు. త్వ‌ర‌లో జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కేసీఆర్ న‌ల్గొండ ఎంపీగా పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు కేసీఆర్.

గజ్వేల్‌లో కేసీఆర్ మినహా ఎవరు పోటీ చేసినా వంటేరు ప్రతాప్ రెడ్డిని ఎదుర్కోవడం కష్టమవుతుందనే అంచనాకు వచ్చిన గులాబీ బాస్… వంటేరును టీఆర్ఎస్‌లోకి తీసుకొచ్చి ఆ తరువాత గజ్వేల్ ఎమ్మెల్యే బరిలో నిలపవచ్చని యోచించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒంటేరు తెరాసలో చేరడంతో గజ్వేల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -