Saturday, April 20, 2024
- Advertisement -

తెలంగాణాలో మ‌రో సారి క‌ర్నాట‌క రాజ‌కీయం..

- Advertisement -

తెలంగాణా ఎన్నిక‌ల్లో ఏపార్టీకీ పూర్తి మెజారిటీ రాద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో మ‌రో సారి ప్ర‌లోభ‌పెట్టే రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. క‌ర్నాట‌క‌లో జ‌రిగిన రాజ‌కీయం తెలంగాణాలో కూడా మ‌రో సారి రిపీట్ కానుంద‌నే వార్త‌లు వ‌నిపిస్తున్నాయి. హంగ్ వ‌స్తే ఇండిపెండెంట్‌ల‌ను , ఇత‌ర పార్టీల నేత‌ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు క‌దుపుతోంది.

తాజాగా టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కాం గ్రెస్ పార్టీపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు బేరసారాలు ఆడుతున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వాలంటూ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేశారని ఆయన చెప్పారు. జానారెడ్డి ఇంట్లో అన్నీ మాట్లాడుకుందామంటూ ఆఫర్ ఇచ్చారి మర్రి జనార్ధన్ బాంబు పేల్చారు.

కొండా విశ్వేశ్వర్ రెడ్డి నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ జాబితాను టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాకు చూపించారు మర్రి జనార్ధన్. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజకీయాలను కాంగ్రెస్ భ్రష్టుపట్టిస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి విరుచుకుపడ్డారు. ఇలాంటి ప్రలోభాలను మానుకోవాలని ధ్వజమెత్తారు.

9490861960 నెంబర్ నుంచి మధ్యాహ్నం 2.07 గంటలకు ఓసారి, మరో కాల్ 2.56 గంటలకు చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ప్రలోభాలను వెంటనే ఆపివేయాలని హెచ్చరించారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -