Wednesday, April 24, 2024
- Advertisement -

2014లో బాబు చేతిలో ఓడిపోయిన ఎపి ఓటర్లే తెలంగాణాకు ఆదర్శం అయ్యారా?

- Advertisement -

ఈనాడు, ఆంధ్రజ్యోతితో సహా పచ్చ మీడియా జనాలందరూ…వాళ్ళతో చంద్రబాబునాయుడు ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను తెలంగాణా ఓటర్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. 2014లో సీమాంధ్రుల ఓటర్లను భ్రమల్లో ముంచి గెలిచిన తర్వాత దారుణంగా మోసం చేసిన వైనం మొత్తం చూసిన తెలుగు వాళ్ళే కదా……..అందుకే చంద్రబాబు జిత్తుల మారి రాజకీయాలను చెప్పుతో కొట్టినట్టుగా తిప్పికొట్టారు. ఒక రకంగా చూస్తే చంద్రబాబు ఇచ్చిన 600హామీలు, చూపించిన గ్రాఫిక్స్ బొమ్మలకు చిత్తయిన ఎపి ఓటర్లే ఇప్పుడు తెలంగాణా ఓటర్లకు ఆదర్శమయ్యారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న అంశంపై మేధావులు చర్చిస్తున్నారు. తెలంగాణా ఓటర్లు చూపించిన విజ్ఙతను ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కూడా చూపిస్తారా? లేక లగడపాటిలాంటి సర్వేల డ్రామాలు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీచ నికృష్ణపు జర్నలిజపుటెత్తులు, న్యూట్రల్ అన్న ముసుగుతో రామోజీరావు అమృతం పేరుతో చిమ్మే విషం, అనుక్షణం అబద్ధాలతోనే కాలం గడిపేస్తున్న చంద్రబాబు రాజకీయానికి మరోసారి బలవుతారా? ఇప్పుడు ఈ అంశంపైనే రెండు తెలుగు రాష్ట్రాల మేధావులు, విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సీమాంధ్ర ఓటర్లు మరోసారి చంద్రబాబుకు పట్టంకడితే మాత్రం దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల సానుభూతిగా చూడడం ఖాయం అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పోటాపోటీ, గెలుస్తున్నాం, గెలిచేశాం అంటూ అబద్ధపు హంగామా చేసిన చంద్రబాబు జిత్తులమారి రాజకీయం, బాబు కోసం లగడపాటి సర్వే డ్రామాలు, రాధాకృష్ణ, రామోజీరావుల విషపూరిత జర్నలిజం రాతలను సమర్థవంతంగా తిప్పికొట్టిన తెలంగాణా ఓటర్లపై దేశవ్యాప్తంగా ప్రశంశలు కురుస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -