- Advertisement -
తెలంగాణాలో ముగ్గురు ఎమ్మెల్సీలపై అనర్హత వేటు పడింది. భూపతిరెడ్డి, యాదవరెడ్డి, రాములు నాయక్లను శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అనర్హులుగా ప్రకటించారు. ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు మండలి ఛైర్మన్ తేల్చడంతో వీరిని అనర్హులుగా ప్రకటిస్తూ కార్యదర్శి బులెటిన్ విడుదల చేశారు.
గవర్నర్ కోటాలో రాములు నాయక్, ఎమ్మెల్యేల కోటాలో యాదవరెడ్డి, స్థానిక సంస్థల కోటాలో భూపతిరెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్లో చేరినందుకు వారి సభ్యత్వాలు రద్దు చేయాలని టీఆర్ఎస్ మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేసింది. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన కొండా మురళి ఇదివరకే మండలి సభ్యుత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.