Friday, April 26, 2024
- Advertisement -

చంద్రబాబుకు ఆప్తమిత్రుడి ఫ్యామిలీ షాక్

- Advertisement -

అసలే ఏపీలో అధికారం కోల్పోయి కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు గోరుచుట్టపై రోకలిపోటులా మరో షాక్ తగిలింది. తెలంగాణలో కునారిల్లుతున్న టీడీపీని ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కబళించేశారు. దీంతో ఉన్న నాయకులు కూడా ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు..

ఆది నుంచి టీడీపీలో ఉన్న నేతలు ఇటు టీఆర్ఎస్ అంటే పడక.. కాంగ్రెస్ అంటే శత్రువుగా భావిస్తున్నారు. దీంతో ఒకప్పుడు టీడీపీతో కలిసి నడిచిన బీజేపీవైపు అడుగులు వేస్తున్నారు. టీడీపీ-బీజేపీ దశాబ్ధాల బంధం ఉండడంతోపాటు తెలంగాణలో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కు కొరకరాని కొయ్యగా మారుతున్న బీజేపీలో చేరితేనే తమ రాజకీయ భవిష్యత్ బాగుంటుందని ఆ దిశగా నేతలు వలసలు కడుతున్నారు..

తాజాగా చంద్రబాబు తర్వాత టీడీపీలో వెలుగు వెలిగిన తెలంగాణ సీనియర్ నేత దేవందర్ గౌడ్ బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. అయితే తండ్రి దేవందర్ గౌడ్ కంటే ముందుగానే ఆక్ష్న కుమారుడు.. తెలుగు యువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వీరేందర్ గౌడ్ టీడీపీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది.

సోమవారం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వీరేందర్ గౌడ్ త్వరలోనే బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి కొడుకు వీరేందర్ గౌడ్ బీజేపీలో చేరారు. ఆ తరువాత తండ్రి దేవందర్ గౌడ్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -