Friday, March 29, 2024
- Advertisement -

జ‌గ‌న్‌పై కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు….

- Advertisement -

ఎన్నిక‌ల ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న సమ‌యంలో తెలంగాణా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ తెలంగాణా సీఎం తో క‌ల‌సిపోయి ఆంధ్రా ప్ర‌జ‌ల‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఏపీ సీఎం బాబు నుంచి ఆ పార్టీ నేత‌లంద‌రూ ఆరోప‌న‌లు చేస్తున్నారు. ఇలాంటి సంయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే వాటికి తోడుగా ఇంకా 150 సీట్లు కలుస్తాయని కేటిఆర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ అంటే పడని 15పార్టీలు మనతో కలుస్తాయని చెప్పారు. ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మనతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలిస్తే, మనకు దన్నుగా నిలిచే పార్టీలతో కలిసి కేంద్రం మెడలు వంచవచ్చు. మన రాష్ట్ర ప్రాజెక్టులకు 90 శాతం వరకూ నిధులు తెచ్చుకోవచ్చ‌న్నారు. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్‌లో మ‌న‌మే కీల‌క పాత్ర పోషిస్తామ‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -